తెలంగాణ

telangana

వేదికలు ఫిక్స్, ఓ రేంజ్​లో ప్రైజ్​మనీ- ఉమెన్స్​ T20 వరల్డ్​కప్ ఫుల్ డిటైల్స్ ఇవే! - Womens T20 World Cup 2024

By ETV Bharat Sports Team

Published : 12 hours ago

Womens T20 World Cup 2024 : 2024 మహిళల టీ20 వరల్డ్ కప్ వేదికలు ఖరారయ్యాయి. దుబాయ్​ షార్జా క్రికెట్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్​లు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం అధికారికంగా ప్రకటించింది.

T20 World Cup 2024
T20 World Cup 2024 (Source : Getty Images)

Womens T20 World Cup 2024 :ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్​లకు వేదికలు ఖరారయ్యాయి. యూఏఈ (UAE)లోని షార్జా క్రికెట్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్​లు నిర్వహించనున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కాగా అక్టోబరు 03 - 20 వరకు యూఏఈలో మహిళల టీ20 వరల్డ్​కప్ జరగనుంది. సెప్టెంబరు 28- అక్టోబర్ 1 వరకు వార్మప్‌ మ్యాచ్​​లు జరగనున్నాయి.

రెండు గ్రూపులు
ఈ వరల్డ్ కప్​లో పాల్గొనే మొత్తం 10 జట్లను రెండు గ్రూప్​లుగా విభజించారు. గ్రూప్‌ Aలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్‌ Bలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.

ఒక గ్రూప్‌ లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌- 2లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరుతాయి. అక్టోబరు 17, 18వ తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్​లు జరగనున్నాయి. అదే నెల 20న దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ జరగనుంది.

రోజుకు రెండు మ్యాచ్​లు
అక్టోబరు 3న రెండు ఈ వరల్డ్​కప్ ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్- స్కాట్లాండ్, పాకిస్థాన్- శ్రీలంక జట్లు షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా తొలి రెండు మ్యాచ్​ల్లో తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అక్టోబర్ 4న దక్షిణాఫ్రికా- వెస్టిండీస్‌, భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య మ్యాచులు జరగనున్నాయి. కాగా టీమ్ఇండియా అక్టోబర్ 4న న్యూజిలాండ్‌, 6న పాకిస్థాన్‌, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది.

2 స్టేడియాల్లో మ్యాచ్​లు
ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న దుబాయ్ ఇంటర్నేషల్ స్టేడియం 2009లో ప్రారంభమైంది. ఇందులో 25,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. అలాగే 1982లో నిర్మితమైన షార్జా క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 200కు పైగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు జరిగాయి. దక్షిణాసియాలో ఈ స్టేడియం బాగా ప్రాచుర్యం పొందింది.

భారీగా పెరిగిన ప్రైజ్​మనీ
2024 టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచింది. 7,958,080 అమెరికా డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో రూ.66 కోట్లకు పైమాటే. దీంతో విజేతలకు ఇచ్చే ప్రైజ్​మనీ కూడా పెరిగింది. గతేడాది జరిగిన టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవగా ఆ జట్టుకు 1 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అదే ఈసారి ఈ ప్రైజ్ మనీని 2.34 మిలియన్ డాలర్లకు పెంచారు. అంటే ఏకంగా 134 శాతం పెరిగింది. భారత కరెన్సీలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విన్నర్​కు దాదాపు రూ.19 కోట్లకు పైగా ప్రైజ్ మనీ అందుతుంది.

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- వరల్డ్​కప్​ మ్యాచ్​లకు వారికి ఫ్రీ ఎంట్రీ - T20 World Cup 2024

ఐసీసీ కీలక నిర్ణయం - వరల్డ్ కప్‌లో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్‌మనీ - Worldcup Equal prize money

ABOUT THE AUTHOR

...view details