Ind vs Eng 5th T20 2025 : భారత్- ఇంగ్లాండ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ ఆదివారం ముంబయి వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే 3-1తో ఒక మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ గెలుచుకుంది. ఆదివారం జరగబోయే మ్యాచ్ కేవలం నామమాత్రమే. ఇందులో భారత్ ఓడినా పెద్దగా నష్టం లేదు. అయితే ఆఖరి మ్యాచ్ను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని 13ఏళ్ల నాటి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. మరి ఈ రివేంజ్ ఏంటంటే?
భారత్- ఇంగ్లాండ్ జట్లు 13 ఏళ్ల తర్వాత ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు టీ20 ఫార్మాట్లో చివరిసారిగా 2012లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక 13ఏళ్ల తర్వాత ప్రతిష్ఠాత్మకమైన వాంఖడే వేదికలో భారత్కి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్లో ఎలాగైనా నెగ్గి సిరీస్లో ఆధిక్యం పెంచుకోవడమే కాకుండా, అప్పటి ఓటమికి బదులు తీర్చుకోవాలని సూర్యసేన భావిస్తోంది.
గత రికార్డులు
పొట్టి ఫార్మాట్లో ఇంగ్లాండ్పై భారత్దే పైచేయిగా ఉంది. భారత్- ఇంగ్లాండ్ జట్లు ఇప్పటి వరకు 28 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాయి. అందులో భారత్ 16 సార్లు గెలుపొందగా, ఇంగ్లాండ్ 12 సార్లు విజయం సాధించింది.
భారత్ జట్టు అంచనా: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ
ఇంగ్లాండ్ జట్టు అంచనా: ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), జాకబ్ బెతెల్, జామీ స్మిత్, ఆదిల్ రషీద్, జేమీ ఓవర్టన్, సాకిబ్ మహ్మద్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్