2024 Cricket Controversies :క్రికెట్ అంటే టన్నుల కొద్దీ పరుగులు, వందల కొద్దీ వికెట్లు, కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు, అరుదైన రికార్డులు. ఇవి మాత్రమే కాదు, క్రికెట్లో అనేక రకాల వివాదాలు కూడా ఉంటాయి. 2024వ సంవత్సరం క్రికెట్లో ఉత్కంఠ భరితమైన మ్యాచ్లతో పాటు కొన్ని కాంట్రవర్సీలను కూడా అందించింది. అటు అభిమానులు, ఇటు ఎక్స్పర్ట్లు తెగ చర్చించేసుకున్న టాప్ 5 వివాదాల గురించి ఇప్పుడు చూద్దాం.
శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వివాదం :బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా నుంచి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ను తప్పించి సంచలన నిర్ణయం తీసుకుంది. గత సీజన్లో రంజీ ట్రోఫీకి వారు గైర్హాజరవడం వల్ల బీసీసీఐ ఆగ్రహించింది. అయితే నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) రాబోయే దేశీయ సీజన్ కోసం తమ హై- పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ ప్రోగ్రామ్లో ఇద్దరు ఆటగాళ్లను చేర్చింది. విమర్శకులు ఈ చర్యను తప్పుబట్టారు. మినహాయించిన ఆటగాళ్లకు అకస్మాత్తుగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు.
సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ :2024 టీ20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (SKY) బౌండరీ లైన్ అందుకున్న సూపర్ క్యాచ్తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో సూర్యకుమార్ రోప్ని టచ్ చేశాడా? లేదా? అని థర్డ్ అంపైర్ చాలా యాంగిల్స్లో టెస్ట్ చేశాడు. చివరికి అవుట్ అని ప్రకటించాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ రోప్కి తగిలాడని, భారత్కు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం ఉందనే ఆరోపణలు వినిపించాయి.