Rohit Sharma BCCI Awards :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కాస్త మతిపరుపు అని, ట్రావెలింగ్లో అప్పుడప్పుడు తన వస్తువులు కూడా మర్చిపోతుంటాడని టీమ్మేట్స్ పలు సందర్భాల్లో చెబుతుంటారు. అయితే దీనిపై రోహిత్ మరోసారి స్పందించాడు. అవన్నీ నిజం కాదని అన్నాడు. ముంబయిలో శనివారం జరిగిన బీసీసీఐ అవార్డుల కార్యక్రమానికి హాజరైన రోహిత్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఈ ఈవెంట్లో రోహిత్తోపాటు హార్దిక్ పాండ్య, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ చిన్న చిట్చాట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే హిట్మ్యాన్ను స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఆసక్తికర ప్రశ్న అడిగింది. 'నీకు ఉన్న ఏ అలవాటును సహచర ఆటగాళ్లు ఎగతాళి చేస్తారు?' అని అడిగింది. దీనికి రోహిత్ ఇచ్చిన జవాబు ఈవెంట్లో నవ్వులు పూయించింది.
'నేను వస్తువులు మర్చిపోతుంటానని నా టీమ్మేట్స్ నన్ను టీజ్ చేస్తారు. అయితే మర్చిపోవడం అనేది నా అలవాటు కాదు. నేను వాలెట్, పాస్పోర్ట్ మర్చిపోతానని వాళ్లు చెప్పిందంతా నిజం కాదు. అదంతా రెండు దశాబ్దల కిందటి మాట. ఇప్పుడు కాదు' అని కూల్గా ఆన్సర్ ఇచ్చాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.