తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్, ధోనీకంటే అత్యంత ధనిక క్రికెటర్! - విరాట్​కు ఈయన ఓసారి ఇళ్లు అద్దెకు ఇచ్చారట!

సచిన్, కోహ్లీ, ధోనీ కాదు- ఇండియా క్రికెటర్లలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Richest Cricketer In India
Richest Cricketer In India (Associated Press,Getty Images)

Cricketer Who Rented Home To Virat Kohli : భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్లు జాబితాలో సచిన్‌, ధోనీ, కోహ్లీ పేర్లు ముందు వరుసలో వినిపిస్తుంటాది. అయితే వీరి కన్నా సంపన్న క్రికెటర్ ఒకరు ఉన్నారు. అయితే ఆయన టీమ్ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించలేదు. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆయన స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీకి తన ఇంటిని అద్దెకు ఇచ్చేంత రేంజ్​కు వెళ్లారు. ఇంతకీ ఆ క్రికెటర్‌ ఎవరంటే?

ఈయన మాజీ రంజీ క్రికెటర్!
గుజరాత్​లోని బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్​జిత్‌ రంజిత్‌ సిన్హ్‌ గైక్వాడ్. ఈయన ఆస్తి విలువ సుమారు రూ.20,000 కోట్లకు పైమాటే అని సమాచారం. అయితే ఈ ఆస్తి ఆయనకు ఎండార్స్​మెంట్లు, బ్రాండ్ ​అంబాసిడర్ కాంట్రాక్టుల వల్ల రాలేదట. వారసత్వంగా వచ్చినట్లు తెలుస్తోంది. వడోదర మహారాజు రంజిత్‌ సిన్హ్‌ ప్రతాప్‌ గైక్వాడ్ ఏకైక కుమారుడే ఈ సమర్​జిత్‌ రంజిత్‌ సిన్హ్‌ గైక్వాడ్‌. 2012 మేలో తన తండ్రి మరణం తర్వాత సమర్​జిత్​కు మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. అందులో భాగంగానే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ సహా పలు విలువైన భవనాలు, ఆస్తులు సమర్ జిత్​కు దక్కినట్లు సమాచారం.

బకింగ్​హామ్ కంటే పెద్ద ప్యాలెస్!
అయితే ఆయన ఆస్తుల్లో ఒకటైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్, బకింగ్ హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు విశాలంగా ఉంటుందని సమాచారం. అలాగే గుజరాత్‌, బనారస్​లలో 17 దేవాలయాలను, ట్రస్ట్​లను కూడా నిర్వహిస్తున్నారు సమర్​జిత్. అలాగే ఈయనకు ముంబయిలో పలు ఖరీదైన ఫ్లాట్​లు ఉన్నాయట. అందులోని ఓ ఆపార్ట్​మెంట్​లో టీమ్​ఇండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కొన్నాళ్ల పాటు అద్దెకు ఉన్నారట.

సచిన్, కోహ్లీ, ధోనీకి అందనంత ఎత్తులో!
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం టీమ్​ఇండియా క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్ నికర ఆస్తి విలువ రూ. 1,427 కోట్లు, ఎంఎస్ ధోనీ ఆస్తి రూ. 932 కోట్లని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ నెట్ వర్త్ కూడా ఇంతే మొత్తంలో ఉంటుందని సమాచారం. అయితే వీరందరికీ అందనంత ఎత్తులో సమర్ జిత్ ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ.20 వేల కోట్లకుపైనే. దీంతో సమర్​జిత్ భారతదేశంలో అత్యంత ధనిక క్రికెటర్​గా నిలిచాడు.

నవానగర్‌ మహారాజుగా భారత మాజీ క్రికెటర్‌

ఇండియా క్రికెట్ 'కుబేరుడు' ఇతడే - సచిన్, విరాట్ కాదు! - Indias Richest Cricketer

ABOUT THE AUTHOR

...view details