Ravichandran Ashwin Wife: టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాజ్కోట్ టెస్టు మధ్యలో ఇంటికి వెళ్లడంపై అతడి భార్య ప్రీతి నారాయణ్ తాజాగా వివరణ ఇచ్చారు. అతడి తల్లి అనారోగ్యం కారణంగా అశ్విన్ టెస్టు మధ్యలో రావాల్సి వచ్చిందని ప్రీతి అన్నారు. ఆరోజు ఏం జరిగిందో ఆమె వివరించారు.
'ఆరోజు రాజ్కోట్ టెస్టు జరుగుతోంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన 5 నిమిషాలకే అశ్విన్ 500 వికెట్ల ఘనత అందుకున్నాడు. అందరూ మాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. అప్పుడే మా అత్తయ్య బిగ్గరగా అరస్తూ కుప్పకూలారు. అత్తయ్యను వెంటనే మేం హాస్పిటల్కు తీసుకెళ్లాం. అశ్విన్కు ఈ మ్యాటర్ చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రాజ్కోట్- చెన్నై మధ్యలో విమాన సర్వీసులు సరిగ్గా లేవని నాకు తెలుసు' అని ప్రీతి అన్నారు.
'వెంటనే ఛెతేశ్వర్ పుజారాకు కాల్ చేశా. పుజారా ఫ్యామిలీ మాకు హెల్ప్ చేసింది. స్కానింగ్స్ పరిశీలించిన తర్వాత అత్తయ్య దగ్గర కుమారుడు (అశ్విన్) ఉంటే బాగుంటుందని డాక్టర్ చెప్పారు. అప్పుడు అశ్విన్కు కాల్ చేసి పరిస్థితి గురించి చెప్పాను. దాంతో అశ్విన్ ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ 20- 25 నిమిషాల్లో తిరిగి ఫోన్ చేశాడు. అతడు రిటర్న్ రావడానికి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా సహకరించారు. అశ్విన్ ఇక్కడకు వచ్చేంతవరకు రోహిత్, రాహుల్ భాయ్ పరిస్థితి గురించి ఫాలోఅప్ చేశారు. అతడు అర్ధరాత్రి చెన్నై చేరుకున్నాడు' అని ఆ రోజు పరిస్థితిని ప్రీతి వివరించారు.