Jos Buttler About BCCI Rules : గత మ్యాచ్ల ఫలితాల దృష్టిలో ఉంచుకుని టీమ్ఇండియాను మెరుగుపరిచేందుకు బీసీసీఐ తాజాగా నయా రూల్స్ను తీసుకొచ్చింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాటిని త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధమైంది. 10 పాయింట్లతో కూడిన రూల్స్ పట్టికను సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లకు బీసీసీఐ పంపించింది. వాటిని బ్రేక్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడటం ఈ కొత్త రూల్స్లో మెయిన్ది కాగా, విదేశాల్లో పర్యటనల సమయంలో క్రికెటర్ల వెంట ఫ్యామిలీ మెంబర్స్ రావడంపై లిమిట్స్ పెట్టడం మరో రూల్. లాంగ్ టూర్లో వైఫ్, పిల్లలు రెండు వారాలు మాత్రమే ఉండొచ్చుని, చిన్న సిరీస్లో మాత్రం కేవలం వారం రోజులు మాత్రమే వారు ఉండేందుకు పర్మిషన్ ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల ప్రయాణం గురించి సెక్రటరీతో మాట్లాడాలని, ప్లేయర్లు తనను అడుగుతున్నారంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన సందర్భంగా అన్నాడు.
ఇక ఐదు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జనవరి 22న ఈడెన్ గార్డెన్స్ (కోల్కతా)లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమెలో టీ20, వన్డే సిరీస్ కోసం భారత్కు వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్పై స్పందించాడు. అంతర్జాతీయ పర్యటనల సమయంలో ప్లేయర్లకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం ఎంతో ఇంపార్టెంట్ అని పేర్కొన్నాడు.