India Squad For Last 3 Tests vs England:ఇంగ్లాండ్తో జరగనున్న ఆఖరి మూడు టెస్టు మ్యాచ్లకు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్లకు కూడా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాను చివరి మ్యాచ్లకు ఎంపిక చేసింది.
కానీ, వారు గాయాల నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే బరిలోకి దిగే ఛాన్స్ ఉంటుంది. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇషాన్ కిషన్, మహ్మద్ షమికి మరోసారి నిరాశే మిగిలింది. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, బౌలర్ ఆకాశ్ దీప్ తొలిసారి టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. తదుపరి మ్యాచ్లో ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ తుదిజట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది.
మిగిలిన 3 టెస్టుల షెడ్యూల్
- మూడో టెస్టు- ఫిబ్రవరి 15-19- రాజ్కోట్
- నాలుగో టెస్టు- ఫిబ్రవరి 23-27- రాంచీ
- ఐదో టెస్టు- మార్చి 07- 11- ధర్మశాల