Ind Vs Eng Test 2024 : జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్టుల సరీస్లో తొలి రెండు మ్యాచ్లకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నాడు పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిరీస్ ప్రారంభానికి కేవలం 3రోజులే మిగిలి ఉండటం వల్ల అతడి స్థానంలో ఎవరినీ జట్టులోకి తీసుకోవాలో తెలియక తలామునకలవుతున్నారు సెలెక్టర్లు.
కొందరు అలా- మరికొందరు ఇలా :రన్ మెషీన్- కోహ్లీ స్థానాన్ని సీనియర్లు ఛెతేశ్వర్ పుజారా లేదా అజింక్య రహానెలలో ఒకరితో భర్తీ చేయాలని కొందరంటుంటే, మరికొందరు యంగ్ ప్లేయర్స్ సర్ఫరాజ్ అహ్మద్, రజత్ పాటిదార్లలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని సజెస్ట్ చేస్తున్నారు. ఈ చర్చ జరుగుతున్న క్రమంలోనే ఇంకొందరు పైనలుగురికి కాకుండా ప్రస్తుతం రంజీలో అదరగొడుతున్న రియాన్ పరాగ్, రికీ భుయ్ల పేర్లను కూడా పరిశీలించాలని కోరుతున్నారు. ఇన్ని రకాల ప్రతిపాదనల నేపథ్యంలో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్కు ప్రత్యామ్నాయంగా సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
రహానే ఔట్?ప్రస్తుత రంజీ సీజన్లో వరుసగా డకౌట్ అయ్యి దారుణంగా బోల్తా పడ్డ అజింక్యా రహానేను ఇంగ్లాండ్ సిరీస్లో ఆడించే అవకాశం లేదనే తెలుస్తోంది. ఇక పుజారా, రజత్ పాటిదార్లలో ఒకరికి సెలెక్టర్లు అవకాశం ఇవ్వనుందని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.