Tilak Varma Duleep Trophy 2024:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ 2024 దులీప్ ట్రోఫీలో సెంచరీతో అలరించాడు. ఈ టోర్నీలో ఇండియా ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్, రెండో రౌండ్లో భాగంగా ఇండియా డి తో మ్యాచ్లో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో (111* పరుగులు ; 193 బంతుల్లో 9 x4) శతకం బాదాడు. ఓపెనర్ ప్రథమ్ సింగ్ (122; 189 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకంతో ఆకట్టుకున్నాడు. ఇక ఇండియా ఎ రెండో ఇన్నింగ్స్ను 380/3 వద్ద డిక్లేర్డ్ చేసింది.
దీంతో ఇండియా డికి 488 పరుగుల లక్ష్యాన్ని (ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ 107 రన్స్ కలుపుకొని) నిర్దేశించింది. ఇక శనివారం ఆట ముగిసేసరికి ఇండియా డి 62/1 (19 ఓవర్లు) స్కోరుతో నిలిచింది. ఇండియా విజయానికి ఇంకా 426 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో యశ్ దూబె (15 పరుగులు), రికీ భుయ్ (44పరుగులు) ఉన్నారు. కాగా, ఓపెనర్ అథర్వ తైడే (0) డకౌటయ్యాడు. అతడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో పెలిలియన్ చేరాడు.
కాగా, తొలి ఇన్నింగ్స్లో ఇండియా ఎ 290-10 పరుగులకు ఆలౌటైంది. షమ్స్ ములాని (89 పరుగులు), తనుష్ కొటియాన్ (53 పరుగులు) ఇద్దరు అర్ధ శతకాలతో రాణించారు. మిగిలిన బ్యాటర్లెవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే బౌలింగ్లో సత్తా చాటిన ఇండియా ఎ మంచి ఆధిక్యం దక్కించుకుంది. ఇండియా డి జట్టును తొలి ఇన్నింగ్స్లో 183-10 పరుగులకే పరిమితం చేసింది. దేవదత్ పడిక్కల్ (92 పరుగులు) ఒక్కడే రాణించాడు. ఖలీల్ అహ్మద్, అకిబ్ ఖాన్ తలో 3, ప్రసిద్ధ్ కృష్ణ, షమ్స్ మనలాని, తనుజ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.