Champions Trophy 8 8 8: క్రికెట్ లవర్స్ను ఉర్రూతలూగించేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసింది. ఇప్పటివరకు టెస్టులు, టీ20లను ఆస్వాదించిన అభిమానులను వన్డే ఫార్మాట్తో ఎంటర్టైన్ చేసేందుకు ఈ మెగా టోర్నీ సిద్ధమైంది. బుధవారమే ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్లో పాకిస్థాన్- న్యూజిలాండ్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈసారి టోర్నీకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే?
8-8-8
- 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. అప్పట్నుంచి 2000, 2002, 2004, 2006, 2009, 2013, 2017 అలా ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ 8సార్లు జరిగింది. ఇందులో భారత్ 2002 (శ్రీలంకతో సంయుక్తంగా), 2013లో ఛాంపియన్గా నిలిచింది
- ఈ ఛాంపియన్స్ ట్రోఫీ దాదాపు 8 ఏళ్ల తర్వాత అభిమానులను అలరించేందుకు వచ్చింది. చివరిసారిగా 2017లో టోర్నీ జరిగింది. ఆ ఎడిషన్లో పాక్ టైటిల్ నెగ్గింది. ఇక దాదాపు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ టోర్నీ జరుగుతోంది
- కాగా, ఈ తొమ్మిదో ఎడిషన్లో టైటిల్ కోసం ఇప్పుడు టాప్- 8 జట్లు బరిలోకి దిగాయి. ఎనిమిది జట్లు నాలుగేసి చొప్పున రెండు గ్రూప్లుగా విడిపోతాయి. ఆ గ్రూప్లోని ఒక్కో జట్టు మిగతా టీమ్లతో ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడతాయి.
మరికొన్ని విశేషాలు