Champions Trophy 2025 Teams Squads :ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. మంగళవారం (ఫిబ్రవరి 11)తో తుది జట్టులో మార్పులు, చేర్పులకు ఐసీసీ ఇచ్చిన గడువు ముగిసింది. ఆటగాళ్లు గాయాల బారిన పడటం వల్ల భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సహా పలు జట్లలో మార్పులు, చేర్పులు జరిగాయి. రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా అత్యధికంగా 5 మార్పులు చేసింది. టీమ్ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
రెండు గ్రూపులుగా జట్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జట్లను రెండు గ్రూపులు విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్- 2గా నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. మార్పుల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8జట్ల స్క్వాడ్లపై ఓ లుక్కేద్దాం.
టీమ్ ఇండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ , రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్ జట్టు
మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజామ్, ఫకర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ ఆఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరిస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిదీ
న్యూజిలాండ్ జట్టు
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైకెల్ బ్రేస్ వెల్, మార్క్ చాప్ మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ , గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
బంగ్లాదేశ్ జట్టు
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజర్ రెహమాన్, పర్వేజ్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా