తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

రేపే వసంత పంచమి ​- అమ్మవారికి ఈ నైవేద్యాలు సమర్పిస్తే ఏడాదంతా మంచే! - VASANT PANCHAMI 2025 PRASADAM

- ఫిబ్రవరి 2న వసంత పంచమి - అమ్మవారికి ఈ ప్రసాదాలు సమర్పిస్తే పూర్తి అనుగ్రహం

Vasant Panchami 2025 Special Prasadam
Vasant Panchami 2025 Special Prasadam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2025, 12:03 PM IST

Vasant Panchami 2025 Special Prasadam: ప్రతీ సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షం ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ పండగ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తారు. అమ్మవారిని ఆరాధిస్తే మంచి జ్ఞానం, చదువు వస్తుందని భక్తుల విశ్వాసం. వసంత పంచమిని పలు ప్రాంతాల్లో బసంత్ పంచమి, శ్రీ పంచమి, సరస్వతీ పంచమి, మాఘశుద్ధ పంచమి అని కూడా పిలుస్తారు. ఈ పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఫిబ్రవరి 2 వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

కేసర్ శ్రీఖండ్:

కావాల్సిన పదార్థాలు:

  • బాగా మీగడ కలిగిన చిక్కటి పెరుగు - 1 కప్పు
  • పంచదార - అర కప్పు
  • కుంకుమపువ్వు- పావు టీస్పూన్​
  • పాలు - 1 టేబుల్​ స్పూన్​
  • యాలకుల పొడి- పావు టీస్పూన్​
  • గార్నిష్​ కోసం బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్​

తయారీ విధానం:

  • గిన్నెలోకి పాలు తీసుకుని అందులో కుంకుమ పువ్వు వేసి ఓ అరగంట సేపు నాననివ్వాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​లోకి పెరుగు వేసి చిక్కగా, మృదువుగా మారేవరకు విస్కర్​తో బీట్​ చేయాలి.
  • పెరుగు బాగా కలిపిన తర్వాత పంచదార వేసి అది కరిగే వరకు బీట్​ చేయాలి.
  • ఆ తర్వాత కుంకుమపువ్వు పాలు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని కనీసం 2 గంటలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.
  • ఆ తర్వాత ఫ్రిడ్జ్​ నుంచి తీసి డ్రైఫ్రూట్స్​తో గార్నిష్​ చేసుకుంటే కేసర్ శ్రీఖండ్రెడీ. దీనిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత తినాలి.

బేసన్ హల్వా:

కావాల్సిన పదార్థాలు:

  • శనగపిండి - 1 కప్పు
  • నెయ్యి - 1 కప్పు
  • బొంబాయి రవ్వ - 2 టేబుల్​ స్పూన్లు
  • డ్రై ఫ్రూట్స్​- పావు కప్పు(జీడిపప్పు, బాదం, పిస్తా సన్నగా కట్​ చేసుకోవాలి)
  • పంచదార పొడి - అర కప్పు
  • వేడి నీరు - అర కప్పు
  • యాలకుల పొడి - అర టీ స్పూన్​

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి మందపాటి కడాయి పెట్టి పావు కప్పు నెయ్యి పోసుకోవాలి. నెయ్యి ఒకేసారి కాకుండా హల్వా తయారయ్యేంతవరకు కొద్దికొద్దిగా పోసుకుంటుండాలి.
  • నెయ్యి కాగిన తర్వాత శనగపిండి వేడి మీడియం ఫ్లేమ్​లో శనగపిండిరంగు మారే వరకు కలుపుతూ వేయించుకోవాలి.
  • ఆ తర్వాత బొంబాయి రవ్వు, 2 టేబుల్​ స్పూన్ల నెయ్యి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరికొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి.
  • శనగపిండి కలర్​ మారి మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పంచదార పొడి వేసి మరోసారి బాగా కలపాలి.
  • ఆ తర్వాత అందులోకి వేడి నీరు పోసి బాగా కలిపి ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత శనగపిండి బాగా మగ్గి నెయ్యి పైకి తేలుతూ పాన్​కు అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాలు కలుపుకోవాలి.
  • మిశ్రమం దగ్గరపడినప్పుడు దింపేముందు సన్నగా కట్​ చేసిన డ్రైఫ్రూట్స్​, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి సర్వ్​ చేసుకుంటే చాలు బేసన్​ హల్వా రెడీ.

"నవ నారసింహ క్షేత్రాలు" ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? - పూర్తి లిస్ట్, విశిష్టత మీ కోసం!

శివుడి మెడలో "పుర్రెల దండ" - స్వామి ధరించడంలో ఆంతర్యమిదే!

ABOUT THE AUTHOR

...view details