తెలంగాణ

telangana

ETV Bharat / politics

పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు - కౌంటింగ్​ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశం - SC on MLA Pinnelli Case

SC on MLA Pinnelli Case : ఆంధ్రప్రదేశ్​కు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టులో షాక్​ తగిలింది. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆయనపై ఆంక్షలు విధించింది.

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 12:48 PM IST

Updated : Jun 3, 2024, 1:55 PM IST

MLA Pinnelli
Supreme Court on MLA Pinnelli Case (ETV Bharat)

SC on MLA Pinnelli Case :ఏపీలోని మాచర్లఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నెల 4న జరిగే ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనలో అడ్డుకునేందుకు యత్నించిన నంబూరి శేషగిరిరావు తనకు ప్రాణభయం ఉందని, పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాలని, అరెస్టుకు హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలని నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 6 వరకు అరెస్టు చేయవద్దన్న వెసులుబాటు ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలు చేయగా, ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని సుప్రీం ఆదేశించింది.

దర్యాప్తు అధికారులు నన్ను టార్గెట్ చేస్తున్నారు - హైకోర్టులో పిన్నెల్లి - Pinnelli Lunch Motion Petition

పిన్నెలి రామకృష్ణా రెడ్డికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇచ్చిన రక్షణపైనా నంబూరి శంకర రావు దాఖలు చేసిన ఎస్​ఎల్​పీపైనా ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది. ఇది న్యాయాన్ని అవహేళన చెయ్యటమే అని మండిపడింది. సీనియర్ న్యాయవాది ఆది నారాయణ, జవ్వాజి శరత్​లు వాదిస్తూ ఎలక్షన్ కమిషన్​కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వీడియోలను ధర్మాసనం ముందు ప్రదర్శించారు. అది చూసి రామకృష్ణా రెడ్డికి సంబంధించిన న్యాయవాదిని దీనికి ఏం సమాధానం చెప్పగలవు అని అన్నారు. దాని గురించి తానేమీ అనదలుచుకోలేదు అని అన్న తర్వాత కోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్​కు సంబంధించిన పరిసరాల్లోకి రాకూడదని, ఆ విధంగా ఒప్పుకుంటున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణలో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని మాత్రమే హైకోర్టు తగు ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది.

'పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది'- సుప్రీంకోర్టును ఆశ్రయించిన నంబూరి - Pinnelli Victim Petition in SC

మే 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి వెళ్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతో పాటు వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పోలింగ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న విపక్ష పార్టీ పోలింగ్ ఏజెంట్‌, టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు వారిపైకి ఒక్క ఉదుటున దూసుకెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాలన్నీ పోలీంగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అవి వైరల్​గా మారడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

హత్యలు, అరాచకాలు, వేల కోట్ల ఆస్తులు - 'ఏపీ నయీమ్​ పిన్నెల్లి'పై టీడీపీ బుక్​ - TDP BOOK ON YCP MLA PINNELLI

అదిగో పిన్నెల్లి - కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కాసేపట్లోనే ప్రత్యక్షం - PINNELLI IN PALNADU

ఒక కేసులో అరెస్టొద్దంటే మొత్తానికే వదిలేస్తారా?- పిన్నెల్లిపై పోలీసుల స్వామిభక్తి - PINNELLI CASES

Last Updated : Jun 3, 2024, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details