తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

ETV Bharat / politics

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండించిన కేటీఆర్​ - అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టమని హెచ్చరిక - KTR Condemned Police Attack

KTR Criticises Police Harassment in Telangana : వికారాబాద్​లోని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై పోలీసులు జరిపిన దాడిని, ఆ పార్టీ నేత కేటీఆర్​ ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు, దాడుల చేస్తున్న వారిని అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టమని హెచ్చరించారు. డీజీపీ, స్పీకర్‌తో మాట్లాడి దాడి చేసిన ఎస్సైపై చర్యలకు ఒత్తిడి తెస్తామని తెలిపారు.

KTR Condemned Police Attack
KTR Condemned Police Attack On BRS Activists (ETV Bharat)

KTR Condemned Police Attack On BRS Activists :వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు నవీన్, ప్రవీణ్​పై స్థానిక ఎస్సై, పోలీసులు దాడి చేసిన ఘటనపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నేతృత్వంలో బాధితులు తెలంగాణ భవన్​లో కేటీఆర్​ను కలిశారు. పోలీసులు తమపై దాడి చేసిన తీరును కేటీఆర్​కు వివరించారు. వారికి ధైర్యం చెప్పిన కేటీఆర్, పార్టీ మొత్తం అండగా ఉంటుందని, అవసరమైతే తాను కూడా వికారాబాద్ వచ్చి ఆందోళన చేస్తానని భరోసా కల్పించారు.

ధైర్యం కోల్పోవద్దని కార్యకర్తలకు సూచించారు. బాధితులకు పూర్తిగా న్యాయసాయాన్ని పార్టీ లీగల్ సెల్ ద్వారా అందిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్​కు వెళ్లి దాడిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలపై దాడులు చేస్తూ అక్రమ కేసులతో వేధిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్న కేటీఆర్, తమ హయాంలో కాంగ్రెస్, బీజేపీ వారికి కొట్టాలని పోలీసులను ఎప్పుడూ పురమాయించలేదని తెలిపారు. దాడులు చేస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాలని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు.

శంకరగిరి మాన్యాలు పట్టించే బాధ్యత నాదే :బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి వారిని శంకరగిరి మాన్యాలు పట్టించే బాధ్యత తనదేనని అన్నారు. పక్క రాష్ట్రంలో ఇలాగే ఎక్స్​ట్రాలు చేసినందుకు ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులనే పక్కన పెట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. ఎస్సైలు, సీఐలు ఎక్స్​ట్రాలు చేస్తే వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డ కేటీఆర్, స్వయంగా ముఖ్యమంత్రే గూండా తరహాలో కొంతమంది గూండాలను ఎస్కార్ట్ పెట్టి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైకి దాడికి పంపారని ఆరోపించారు.

తమ వాళ్లే దాడి చేశారని సీఎం మాట్లాడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తరహాలోనే కాంగ్రెస్ నాయకులంతా వ్యవహరిస్తున్నారన్న ఆయన, నాలుగు రోజులు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుందని, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు ఊర్లలో తిరిగే పరిస్థితి ఉండదని చెప్పారు. శాసనసభాపతి నియోజకవర్గంలో దళిత బిడ్డలను పోలీసులు కొడుతుంటే పట్టించుకోకపోవటం విచారకరమని కేటీఆర్ అన్నారు. పార్టీలకు అతీతంగా ఇలాంటి దాడులను సభాపతి ఖండించాలని అన్నారు. దాడికి పాల్పడిన ఎస్సై విషయంలో చర్యలు తీసుకోవాలని స్పీకర్​తో, డీజీపీతో మాట్లాడతానని చెప్పారు.

సీఎం రేవంత్, ఆయన అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు : కేటీఆర్ - KTR Fires On CM Revanth Reddy

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం - 'పేదలపైకి బుల్డోజర్లు - రైతులపైకి బ్యాంకు అధికారులు' - KTR TWEETS TODAY LATEST NEWS

ABOUT THE AUTHOR

...view details