ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఓటర్ల తుది జాబితా 'కొత్త సీసాలో పాత సారా' చందం - ప్రతిపక్షాల అభ్యంతరాలు బుట్టదాఖలు ! - ఎన్నికల కమిషన్

Errors in Final Voters List : ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఏపీ ఓటర్ల తుది జాబితా తప్పుల తడకగా ఉందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. మరణించిన, డబల్ ఎంట్రీలపై తామిచ్చిన సూచనలు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా పాత జాబితానే మళ్లీ ఇచ్చారని పేర్కొంటున్నారు.

ap_voters_list
ap_voters_list

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 3:35 PM IST

Errors in Final Voters List : ఓటర్ల తుది జాబితాలోనూ లెక్కకు మించిన తప్పులు. డెత్​లు - డబుల్ ఎంట్రీలు. సమాచారం ఇచ్చినా తొలగించని అధికారులు. ఒక ఇంట్లో ఉండేది నలుగురే అయినా జాబితాలో 50 ఓట్లు ఉన్నాయి. ఇలా ఎన్నికల కమిషన్ ఇచ్చిన తుది ఓటర్ల జాబితాలోనూ తప్పుల తడకలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు తప్పులు చూపించినా దిద్దుబాట్లు జరగలేదు. కొన్ని అభ్యంతరాలను పరిశీలించలేదు. వలస ఓట్లు. డబల్ ఎంట్రీ ఓట్లు కొనసాగించారు. ఇంత పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం ఉన్నా తుది జాబితాలోనూ తప్పులు ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఓటర్ల జాబితా సవరణ దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్‌ కేసులు : ఈఆర్వో

ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా తప్పులమయంగా మారింది. 2023 అక్టోబర్ 27నుంచి డిసెంబర్ 9వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమం జరిగింది. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఓటు నమోదుకు 1.35లక్షల దరఖాస్తులు వచ్చాయి. మృతులు, దీర్ఘకాలికంగా వలస వెళ్లిన వారు ఇలా అనర్హుల తొలగింపునకు 2.01లక్షల దరఖాస్తులు వచ్చాయి. తప్పుల సవరణలు, చిరునామాల మార్పు వంటి వాటికి మరో 2.58లక్షలు వచ్చాయి. మొత్తంగా 6.95లక్షల దరఖాస్తులు అందాయి. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు, ఉప తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవడంతో తుది జాబితాలోనూ దిద్దుబాట్లు జరగలేదు.

ఓటర్ల జాబితా విషయంలో ఏపీలోనే ఎందుకు ఇన్ని ఫిర్యాదులు ?

వరికుంటపాడులో 88, 89 పోలింగ్ కేంద్రాల పరిధిలో పెంచలమ్మ, శ్రీనివాసులు, లక్ష్మమ్మ, రమణమ్మ, వెంకటనారాయణ, రుక్మిణమ్మ ఇలా 20మంది వరకు మృతి చెందిన వారి పేర్లను తుది జాబితా నుంచి తొలగించలేదు. కావలికి చెందిన అనంతబొట్ల పద్మావతి కుటుంబంలో ఆరు ఓట్లు ఉన్నాయి. ఐదుగురి ఓట్లు స్థానికంగా 77వ నంబర్ పోలింగ్ బూత్ లో ఉన్నాయి. పద్మావతి ఓటు రెండు కిలోమీటర్ల దూరంలోని 83వ బూత్ లో ఓటు ఉంది. మార్చమని దరఖాస్తు చేసినా ఫలితం లేక పోయింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేదాయపాళెం సమీపంలోని ఇంటి నెంబర్ 26-03-287 లో నాలుగు ఓట్లకు మించి ఉండవు, అటువంటిది 50మందికిపైగా ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు.

డూప్లికేట్, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు

మా యూనిట్లో ఆరు బూతులు ఉన్నాయి. తుది జాబితాలో అధికారులు చెప్పినట్లుగా కాకుండా 77వ నంబర్​ బూత్​లో మరణించివారి ఓట్లు ఆరు ఉన్నాయి. ఇంకో బూత్​లో రెండు డబల్​ ఓట్లున్నాయి. - రఘుబాబు, నరకూరు ఎంపీటీసీ మెంబర్

సర్వేపల్లి నియోజకవర్గంలో 110బూత్​ నంబర్​లో తుది జాబితా అస్తవ్యస్తంగా ఉంది. బీఎల్​ఓలు, ఇతర అధికారులు ఎవరూ కూడా పాత జాబితాను సవరించలేదు. మేం చేసిన సూచనలను బుట్టదాఖలు చేశారు. - అవినాష్, కోడూరు పంచాయతీ

కొత్త జాబితాలో అనేక తప్పిదాలున్నాయి. చనిపోయిన వారి ఓట్లు యధాతథంగా ఉన్నాయి. అక్కడక్కడా పది, ఇరవై ఓట్లు తొలగించి 70శాతం తప్పులు అలాగే ఉంచారు. ఏ అధికారి కూడా ఓటర్ వెరిఫికేషన్​ గురించి పట్టించుకోలేదు.- మస్తాన్ బాబు పొదలకూరు

తుదిజాబితా అంతా తప్పుల తడకగా ఉంది. మరణించిన వారి ఓట్లు అలాగే ఉంచారు. ఇంత మంది అధికారులున్నా జాబితాను సరిదిద్దకపోవడం విచారకరం. ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాలపై చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎన్నికల కమిషన్​ ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ముసాయిదా జాబితాలో లోపాలు ఎత్తి చూపినా, చాలా వరకు సవరించకుండానే వదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది.

రెండో రోజూ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రత్యేక డ్రైవ్‌ - వైసీపీ నేతలకు రెండు, మూడేసి ఓట్లు

ABOUT THE AUTHOR

...view details