తెలంగాణ

telangana

లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు​ వచ్చే సీట్లు 'సున్న' : ఉత్తమ్​ కుమార్ రెడ్డి - Cong Raghuveer reddy Nomination

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 7:20 PM IST

Congress Nalgonda MP Candidate Nomination : నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘవీర్‌ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రఘువీర్​ రెడ్డి నామినేషన్​ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇతర పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ కూడా పాల్గొన్నారు.

Congress Nalgonda MP Candidate Nomination
Congress Nalgonda MP Candidate Nomination

Cong Nalgonda MP Candidate Raghuveer Reddy Nomination :నల్గొండలో బీజేపీ, బీఆర్ఎస్​కు డిపాజిట్లు కూడా రావని మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి, నల్గొండ జిల్లాకి ఏమీ చేయని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్​ మనుగడ ఉండదని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు వచ్చే సీట్లు 'సున్న' అని వ్యాఖ్యానించారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఉత్తమ్​ కుమార్ రెడ్డి హాజరైన ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Minister Uttam Kumar Reddy Fires On BRS BJP :రఘువీర్​ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మాట్లాడినఉత్తమ్​ కుమార్ రెడ్డి బీఆర్​ఎస్​, బీజేపీలపై మండిపడ్డారు. రైతులకు కనీసమద్ధతు ధర ఇస్తామన్న బీజేపీ ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని ఆరోపించారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే జిల్లాలో అభివృద్ధి జరగలేదన్నారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. పార్టీ ఘన విజయం సాధించేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్​ పార్టీ మనుగడ కోల్పోతుందని జోస్యం చెప్పారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన : మంత్రి ఉత్తమ్‌కుమార్‌

"నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీకి,బీఆర్ఎస్​కు డిపాజిట్​ దక్కదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ మోసం చేసింది. బీజేపీ హాయంలో సమాజంలో అన్ని వర్గాల వారికి మోసం జరిగింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గాలికివదిలేశారు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదు" - ఉత్తమ్​ కుమార్ రెడ్డి, మంత్రి

Congress Party Election Campaign :అంతకు ముందు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా మంత్రులు ఉత్తమ్​ కుమార్​, కోమటిరెడ్డి ప్రచార రథంపై వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​ పార్టీ రెండు లోక్​సభ స్థానాలు గెలుచుకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి ఛాలెంజ్ చేశారు.

లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు​ వచ్చే సీట్లు 'సున్న'- ఉత్తమ్​కుమార్ రెడ్డి

బీజేపీ గత పదేళ్లలో మతతత్వ రాజకీయం తప్ప చేసేందేమీ లేదు : మంత్రి ఉత్తమ్​ - Minister Uttam on BJP

కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు - ఆయన మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమే : ఉత్తమ్​కుమార్​ రెడ్డి - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details