ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంత్రుల పనితీరుపై కేబినెట్‌ భేటీలో ప్రస్తావన- ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్న చంద్రబాబు - CM on Ministers Performance

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 5:20 PM IST

CM Chandrababu on Performance of Ministers: వందరోజుల పనితీరుపై మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కల్యాణ్​కు అందచేస్తామని చెప్పారు. కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీతిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలదేనని వెల్లడించారు.

cm_on_ministers_performance
cm_on_ministers_performance (ETV Bharat)

CM Chandrababu on Performance of Ministers:మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. వంద రోజుల తర్వాత మంత్రులకు ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు. జనసేన మంత్రుల రిపోర్టును పవన్ కల్యాణ్‌కు అందిస్తామని సీఎం తెలిపారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరి తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ప్రవర్తన మితీమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు.

ఒకరిద్దరు తీరుతో ప్రభుత్వం చేసే మంచి పక్కకుపోయి, నేతల తీరే హైలెట్ అవుతోందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. మాయ చేయడానికే గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశ పెట్టిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని రివర్స్ టెండరింగ్‌కు అర్థం ఏముందని అన్నారు. సీవీసీ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని మంత్రులు సూచించారు. తాను చేసిన తప్పులకు ఓ జడ్జితో ఆమోదముద్ర వేయించుకోవడానికే జగన్ జ్యుడిషియల్ ప్రివ్యూను తీసుకొచ్చారని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యవస్థ రద్దు చేసేలా చూడాలని కోరారు.

దేవాదాయశాఖ అర్చకులకు ఇక నుంచి రూ. 15 వేల వేతనం-సీఎం చంద్రబాబు - CBN Review on Endowments Department

ఇసుక పాలసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమయ పరిమితులు లేకుండా ఇసుక సరఫరాకు అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుందని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. రేషన్ షాపుల్లో సార్టెక్స్ బియ్యం సరఫరా నిలిపిస్తే విమర్శలు వస్తాయేమో అని పలువురు మంత్రులు అనగా మరింత అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు.

రేషన్ వాహనాలను రద్దు చేయాలన్న నిర్ణయంపై మంత్రివర్గంలో చర్చ జరగ్గా వాహనాలకు బ్యాంక్ లింకేజీ ఉన్నట్టు అధికారులు చెప్పారు. రేషన్ వాహనాలతో ఎలాంటి ఉపయోగం లేదని పయ్యావుల చెప్పగా బ్యాంక్ లింకేజీతో ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫ్రీ-హోల్డ్‌లోకి వెళ్లిన భూముల్లో సత్యసాయి జిల్లాలోనే అత్యధికంగా 5 వేల ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు జరిగాయని చర్చ జరిగింది. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

'ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలి' -'దేవాదాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష - CM Chandrababu Review

రేపు నరసరావుపేటకు చంద్రబాబు, పవన్​- జేఎన్​టీయూలో బహిరంగ సభ

ABOUT THE AUTHOR

...view details