తెలంగాణ

telangana

బీఆర్‌ఎస్​పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : కేటీఆర్ - KTR Responds to BRS Party Merge

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 4:24 PM IST

Updated : Aug 7, 2024, 9:01 PM IST

KTR Reacts On BRS Party Rumours : బీఆర్‌ఎస్​ పార్టీపై పుకార్లు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆ పార్టీ సీనియర్​ నేత కేటీఆర్​ హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన, నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఇరవై నాలుగేళ్ల నుంచి ఇలాంటి అనేక కుట్రలు గులాబీ పార్టీ ఎదుర్కొందన్న కేటీఆర్​, అన్నీ దాటుకొని తెలంగాణ సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.

KTR Reacts On BRS Party Rumours
KTR Responds to BRS Party Merge (ETV Bharat)

KTR Warning On BRS Party Merge Rumours : భారత రాష్ట్ర సమితిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఘాటుగా స్పందించారు. నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమది అన్న ఆయన, అన్నీ దాటుకొని నిబద్ధత, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్​ అని వివరించారు. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్ర భాగాన నిలిపినట్లు పేర్కొన్నారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్లు కేటీఆర్ తెలిపారు.

కోట్లాది గొంతుకలు, హృదయాలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం చేస్తున్న పోరాటం వల్లే సాధ్యమైందని అన్నారు. ఎప్పటిలానే బీఆర్ఎస్​ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని, పోరాడుతుందని చెప్పారు. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలు, దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు. పడతాం, లేస్తాం తెలంగాణ కోసమే పోరాడుతామన్న కేటీఆర్, ఏనాటికీ, ఎప్పటికీ తలవంచబోమని స్పష్టం చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. పెట్టుబడుల పేరిట షెల్ కంపెనీలు, స్కాంగ్రెస్ ఎత్తుగడలతో ప్రజలను ఫూల్ చేస్తున్నారని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. దావోస్​లో గోడి పేరుతో ఉన్న కంపెనీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు నెల రోజుల్లోపు స్వచ్చ బయో కంపెనీగా మార్చారన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇలాంటివి ఇంకా చాలా వస్తాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెనక మతలబు ఇదేనని గులాబీ నేత ఆరోపించారు.

మా పాలనలో నేతన్నల ముఖాల్లో చిరునవ్వులు - రేవంత్ వచ్చాక ఛిద్రమైన బతుకులు : కేటీఆర్ - KTR ON TELANGANA HANDLOOM WORKERS

కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోంది : కేటీఆర్ - IT exports and jobs in Telangana

Last Updated : Aug 7, 2024, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details