KTR Reaction on Coal Mine Auction: తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ పరిరక్షించలేదంటూ ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్పై, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దుస్సాహసాన్ని చూసి, సమాధిలో ఉన్న జోసెఫ్ గోబెల్స్ ఉలిక్కిపడ్డారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను వినిపించి, స్పందించిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల నిజమైన ఆకాంక్షలను వినడానికి నిరాకరించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ వేలాది మంది యువకులను క్రూరంగా తొక్కించి, నిర్దాక్షిణ్యంగా చంపిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తెలంగాణలోని ప్రతి పౌరుడు గమనిస్తున్నాడు : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఏ విధంగా పని చేస్తున్నాయో ప్రతి తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల అమ్మకాలను కేసీఆర్, బీఆర్ఎస్ ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తోందని, ప్రస్తుత ప్రభుత్వం తరహాలో ఎవరూ వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు.
బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు : చివరి రౌండ్లో రెండు బ్లాకులను ఏకపక్షంగా వేలం వేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అని, బీఆర్ఎస్ వ్యతిరేకించినందుకే ఇప్పటి వరకు ఆ బ్లాకుల్లో తవ్వకాలు మైనింగ్ జరగలేదని వివరించారు. బీజేపీ ప్రభుత్వం బ్లాకులు కేటాయించిన తర్వాత కూడా ఆ రెండు కంపెనీలను ఒక్క అంగుళం కూడా తరలించేందుకు తమ ప్రభుత్వం అనుమతించకపోవడమే బీఆర్ఎస్కు వాటితో ఎలాంటి సంబంధం లేదనడానికి నిదర్శమని పేర్కొన్నారు.
సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా : కిషన్రెడ్డి - Kishan Reddy on Coal Mine Auction