తెలంగాణ

telangana

ETV Bharat / politics

ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై బీజేపీ నిరసన - శాసనసభలో కాంగ్రెస్‌ నేతలతో వాగ్వాదం - BJP ON VIOLATION OF PROTOCOL

ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల నిరసన - సభ దృష్టికి తీసుకెళ్లిన ఆ పార్టీ నేతలు

BJP MLAs on Violation of Protocol Issues Telangana
BJP MLAs on Violation of Protocol Issues Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 1:28 PM IST

Updated : Dec 9, 2024, 2:38 PM IST

BJP MLAs on Violation of Protocol Issues Telangana : ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై అసెంబ్లీలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ఈ అంశంపై శాసనసభలో బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నియోజకవర్గాల్లో తమను పట్టించుకోవడం లేదని కనీస సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. తాము గౌరవం ఇస్తున్నప్పుడు, అధికార పార్టీ నేతలు కూడా అలానే ఉండాలన్నారు. సమసమానం అన్న నేతలు నిధులు కేటాయింపులో వివక్షత చూపిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం చేసిన ప్రకటన మీద చర్చ సాగుతుంటే బీజేపీ సభ్యులు ప్రోటోకాల్‌పై మాట్లాడటం సరికాదని అధికార పక్ష సభ్యులు సూచించారు. స్పీకర్‌కు చేయి చూపిస్తూ మాట్లాడటంపై మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తాము కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డామని, ఆ ఆవేదన ఏలా ఉంటుందో తెలుసని అన్నారు. అందుకే ప్రత్యేకంగా బీజేపీ నేతలతో స్పీకర్‌ ఛాంబర్‌లో మాట్లాడుతామన్నారు. సభను అమర్యాదపరిచేలా మాట్లాడవద్దని వారించిన స్పీకర్‌, సభ తర్వాత బీజేపీ సభ్యులను, మంత్రిని పిలిచి మాట్లాడుతానని చెప్పారు.

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు - సభ ముందుకు 5 బిల్లులు, 2 నివేదికలు

అంతకుముందు ఉదయం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా ట్రాక్టర్‌పై వచ్చారు. హైదర్‌గూడ హోల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ మీదుగా అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న డిమాండ్‌తో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అసెంబ్లీలో కూడా హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

'తెలంగాణ తల్లి అంటే భావన కాదు - 4 కోట్ల బిడ్డల భావోద్వేగం'

Last Updated : Dec 9, 2024, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details