AP LIQUOR SCAM IN YSRCP REGIME: దిల్లీ మద్యం కుంభకోణం కంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కాం పది రెట్లు పెద్దదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ జీరో అవర్లో లోక్సభ దృష్టికి తెచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
2019 - 24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చి కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. మద్యం అంశంపై లోక్సభ జీరోఅవర్లో ప్రస్తావించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, వైఎస్సార్సీపీ హయాంలో దిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే జగన్ స్కామ్ పది రెట్లు పెద్దదని అన్నారు.