తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 4:00 PM IST

Updated : May 7, 2024, 4:09 PM IST

ETV Bharat / politics

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసీ వేణుగోపాల్ అసహనం​ - పని చేసిన వారికే పదవులిస్తామని స్పష్టం - KC Venugopal zoom meet with Leaders

KC Venugopal on Lok Sabha Elections in Telangana : తెలంగాణలో అధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని, అందుకోసం మరింత ఉత్సాహంతో పని చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. ఎన్నికల్లో పని చేసిన తీరును బట్టి తదుపరి పదవులు ఉంటాయని తెలిపారు.

KC Venugopal Guidelines To Congress Leaders
KC Venugopal on Lok Sabha Elections in Telangana (ETV Bharat)

KC Venugopal Guidelines To Congress Leaders : తెలంగాణాలో అధిక స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించబోతుందని, నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ అధిష్ఠానం సూచించింది. లోక్‌సభ ఎన్నికల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు నేతల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలకు మరో ఐదు రోజులే ఉన్న సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ కాంగ్రెస్​ నాయకులతో జూమ్​ ద్వారా అత్యవరసర సమవేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఈ భేటీకి మంత్రి దామోదర రాజనర్సింహ, 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటంపై కేసీ వేణుగోపాల్‌ అసహనం వ్యక్తం చేశారు. గంటకు పైగా సాగిన ఈ జూమ్‌ మీటింగ్‌లో పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలు తదితరాల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, విక్రమార్క, దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డిలు వివరించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అసహనం :నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి చూసుకుంటారని కేసీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌ స్థానాన్ని నిర్లక్ష్యం చేయటం పట్ల ఇన్‌ఛార్జ్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసీ వేణగోపాల్‌ అసహనం వ్యక్తం చేశారు. అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్దేశించారు. నియోజకవర్గంలోనే ఉండి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పారు.

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు - బీజేపీ, బీఆర్ఎస్ పదేళ్లుగా చేసిందేం లేదంటూ ప్రచారం - Congress Election Campaign.

పని తీరు ఆధారంగానే తదుపరి పదువులు :ఎమ్మెల్యేలను, మంత్రులను సమన్వయం చేయటంలో సరిగా వ్యవహరించడం లేదంటూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌పై కేసీ వేణుగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం 'దిశ దశ' మార్చే ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే తదుపరి పదవులు ఉంటాయన్న కేసీ వేణుగోపాల్‌ ఎమ్మెల్యేవరూ నిర్లక్య ధోరణి ప్రదర్శించ వద్దని హెచ్చరించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసీ వేణుగోపాల్ అసహనం​ - పని చేసిన వారికే పదవులిస్తామని స్పష్టం (ETV Bharat)

రాష్ట్రంలోని పరిస్థితులపై రేవంత్ వివరణ :పెండింగ్‌లో ఉన్న రైతుబంధు కూడా ఇప్పటికే పంపిణీ పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశంలో వెల్లడించారు. త్వరలో రుణమాఫీ సైతం చేయనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ నిర్దేశించిన పనిని ప్రతి ఒక్కరూ చేయాలన్న సీఎం పార్టీ నిర్ణయాలను ఎవరూ నిర్లక్ష్యం చేయ్యొద్దని చెప్పారు. జామ్ మీటింగ్‌లో ఎవరెవరు పాల్గొనలేదో నివేదిక ఇవ్వాలని మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు కేసీ వేణగోపాల్‌ ఆదేశించారు.

మన పోరాటం బీఆర్ఎస్​పై కాదు బీజేపీపై - రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం - LOK SABHA ELECTIONS 2024

రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్ల ఫీట్ - కాపాడాలంటే కాంగ్రెస్ రావాల్సిందే : భట్టి విక్రమార్క - BHATTI VIKRAMARKA ON RESERVATIONS

Last Updated : May 7, 2024, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details