తెలంగాణ

telangana

'రామోజీరావు సేవలు చిరస్మరణీయం'- అక్షర యోధుడికి ఉద్యోగుల నివాళులు - Homage To Ramoji Rao

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 7:40 PM IST

Tributes To Ramoji Rao : వివిధ రాష్ట్రాల్లోని రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు రామోజీరావుకు ఘన నివాళులు అర్పించారు. ఆయా రాష్ట్రాల్లోని కార్యాలయాల్లో అక్షరయోధుడి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. (ETV Bharat)
Tribute To Ramoji Rao : రామోజీరావుకు వివిధ రాష్ట్రాల్లోని రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు నివాళులు అర్పించారు. (ETV Bharat)
ఈటీవీ భారత్ - ఒడిశా ఆధ్వర్యంలో భువనేశ్వర్​లో జరిగిన సంస్మరణసభలో దివంగత రామోజీరావుకు బ్యూరో చీఫ్ సహా రిపోర్టర్లు, ఇతర సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. (ETV Bharat)
మీడియా, వినోద రంగాలతోపాటు దేశానికి ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. (ETV Bharat)
చెన్నైలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉద్యోగులు రామోజీరావుకు నివాళులు అర్పించారు. (ETV Bharat)
అక్షర యోధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. (ETV Bharat)
కర్ణాటకలో మార్గదర్శి చిట్ ఫండ్స్ , ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. (ETV Bharat)
రామోజీరావు చిత్రపటానికి ఉద్యోగులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. (ETV Bharat)
ఉత్తరాఖండ్ దెహ్రాదూన్​లో ఈటీవీ భారత్ ఉద్యోగులు రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. (ETV Bharat)
దేశ రాజధాని దిల్లీలోని బ్యూరో కార్యాలయంలో కూడా రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. (ETV Bharat)
ఈ సందర్భంగా ఉద్యోగులు రామోజీరావుకు పుష్పాంజలి ఘటించారు. (ETV Bharat)
చండీగఢ్​లో రామోజీ అస్తమయం పట్ల సంతాపంగా ఉద్యోగులు మౌనం పాటించారు. (ETV Bharat)
ముంబయి బీకేసీ కార్యాలయంలో రామోజీరావుకు ఉద్యోగులు నివాళులర్పించారు. (ETV Bharat)
ఛత్తీస్​గఢ్ రాజధాని రాయ్ పుర్​లో ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామోజీరావుకు ఉద్యోగులు శ్రద్ధాంజలి ఘటించారు. (ETV Bharat)
హిమాచల్ ప్రదేశ్ శిమ్లా ఈటీవీ భారత్​ కార్యాలయంలో రామోజీరావుకు ఉద్యోగులు నివాళులు అర్పించారు. (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details