Fasting on Maha Shivaratri :ఉపవాసం చేయడం వల్ల పలు ఉపయోగాలు ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో మహాశివరాత్రి వేళ "ఎవరైనా సరే ఫాస్టింగ్ ఉండొచ్చా!" అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపవాసం ఉండడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో గ్లూకోజ్ నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని Cell Metabolism జర్నల్ వెల్లడించింది. "Early Time-Restricted Feeding Improves Insulin Sensitivity, Blood Pressure, and Oxidative Stress Without Weight Loss in Humans." అనే అంశంపై జరిగిన అధ్యయనంలో University of Alabama at Birmingham పరిశోధకులు Erin F. Sutton పాల్గొన్నారు.
షుగర్పై పరిశోధనల్లో కీలక మలుపు - ఆ ప్రొటీన్ పెంచుకుంటే మధుమేహం అదుపులోనే!
రోజులో ఒక పూట లేదా వారంలో అప్పుడప్పుడు క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని మనం ఉపవాసం అంటే వైద్యపరిభాషలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇలా ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో మంచి మార్పులు జరుగుతున్నాయని, జబ్బులకు కారణమయ్యే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. అప్పుడప్పుడు చేసే ఉపవాసాల (Intermittent fasting) వల్ల శరీరంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మధుమేహం(Diabetes)తో బాధపడేవారు ఉపవాసం చేయొచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ సందేహాలకు సమాధానం తెలుసుకుందాం.
షుగర్ బాధితులు సక్రమంగానే తింటున్నా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదని వైద్యులు చెబుతున్నారు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అని పిలుస్తుంటారు. ఈ సమయంలో వీరి శరీరం పిండిపదార్థాలు తీసుకుంటున్నా సరే కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుందన్నారు. ఫలితంగా 3 గంటలకు మించి ఆహారం తీసుకోకుండా ఉంటే ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అనేది పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక ఆరు గంటలకు మించి ఎలాంటి ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడుతుందయ. ఫలింతగా శరీరంలో ఎసిటాల్డిహైడ్, ఎసిటోన్, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్ అనే ఆమ్ల పదార్థాల స్థాయి పెరిగి కీటోన్ బోడీస్ అనే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.