తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనీయులే టార్గెట్​! పాక్​ ఎయిర్​పోర్టులో భారీ పేలుడు- ముగ్గురు మృతి-17 మందికి గాయాలు - Explosion In Pakistan Airport

Explosion In Pakistan Airport : పాకిస్థాన్​ కరాచీ ఏయిర్​పోర్టులో భారీ పేలుడు. ఇద్దరు చైనీయులు సహా ముగ్గురు మృతి. 17మందికి గాయాలు

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Explosion In Pakistan Airport
Explosion In Pakistan Airport (Associated Press)

Explosion In Pakistan Airport :పాకిస్థాన్​ కరాచీలోని జిన్న అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులు సహా ఒక పాకిస్థానీ మృతిచెందారు. మరో 17మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ ఆయిల్​ ట్యాంకర్​కు మంటలు అంటుకున్నాయని, ఆ తర్వాత అక్కడున్న మరికొన్ని వాహనాలకు మంటలు వ్యాపించాయని డిప్యూటీ ఇన్స్పెక్టర్​ జనరల్ ఈస్ట్​ అజ్​ఫర్​ మషేహర్ తెలిపారు. ఈ ఘటనలో ఉగ్రవాద హస్తం ఉండే అంశాన్నితోసిపుచ్చలేమని చెప్పారు.

పోర్ట్ ఖాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (ప్రైవేట్) లిమిటెడ్‌ కంపెనీలో పనిచేసే చైనా సిబ్బందిని తీసుకెళ్తున్న కాన్వాయ్‌పై రాత్రి 11 గంటల సమయంలో దాడి జరిగిందని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులు మరణించారని, మరొకరు గాయపడ్డారని ఒక పాకిస్థానీ కూడా మరణించినట్లు చెప్పింది. అంతేకాకుండా ఈ ఘటనను ఉగ్రదాడిగా డ్రాగన్​ పేర్కొంది. ఈ ఘటన తర్వాతి పరిణామాలపై పాకిస్థాన్​తో చైనా కలిసి పనిచేస్తోందని తెలిపింది. ఈ పేలుడుపై సమగ్ర విచారణ జరిపించాలని పాకిస్థాన్​ ప్రభుత్వాన్ని కోరింది. పాక్​లోని చైనా పౌరులు, కంపెనీలు, ప్రాజెక్టుల భద్రతపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

అయితే వీదేశీయులు టార్గెట్​గా ఈ దాడి జరిగిందని ప్రోవిన్సియల్ హోం మంత్రి జయి ఉల్ హసన్ స్థానిక మీడియాకు తెలిపారు. ఇక, ఏయిర్​పోర్టులో చాలా పెద్ద పేలుడు సంభవించిందని, ఆ పేలుడు ధాటికి విమానాశ్రయ భవనాలు కంపించాయని అక్కడ పనిచేస్తున్న రాహత్ హుస్సేన్ తెలిపారు. కాగా, చైనా తలపెట్టిన బెల్ట్​ అండ్ రోడ్​ ప్రాజెక్టులో భాగంగా వేల మంది చైనీయులు పాకిస్థాన్​లో పనిచేస్తున్నారు.

ఈ ఏడాది మార్చిలో పాకిస్థాన్​లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనా దేశస్థులు సహా ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇస్లామాబాద్​ నుంచి కోహిస్థాన్ వెళ్తున్నపేలుడు పదార్థాలతో నిండిన వాహనం, ​షాంగ్లా జిల్లాలోని బిషామ్​ ప్రాంతంలో ఓ బస్సును ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో బస్సులో ఉన్న చైనీయులతో పాటు డ్రైవర్​ ఉన్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details