తెలంగాణ

telangana

రాత్రి తిన్న గిన్నెలన్నీ - పొద్దున్నే క్లీన్ చేద్దామని సింక్​లో వదిలేస్తున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా? - Leaving Dishes In The Sink

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 11:35 AM IST

Leaving Dishes In The Sink : చాలా మంది రాత్రిపూట తిన్న పాత్రలను తోమకుండా సింక్​లో వదిలేస్తుంటారు. పొద్దునే లేచి క్లీన్ చేస్తుంటారు. మీరు ఇలాగే చేస్తున్నారా? అయితే, మీకో బిగ్ అలర్ట్!

Do You Leaving Dirty Dishes In Sink Overnight
Leaving Dishes In The Sink (ETV Bharat)

Do You Leaving Dirty Dishes In Sink Overnight : మెజార్టీ పీపుల్ రాత్రి భోజనం తర్వాత తిన్న గిన్నెలు(Dishes) కడగకుండా సింక్​లో వదిలేసి, మరుసటి రోజు మార్నింగ్ క్లీన్ చేస్తుంటారు. మీరూ ఇలాగే చేస్తున్నారా? అయితే.. అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. గిన్నెలను నైట్ మొత్తం సింక్​లో ఉంచడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

తిన్న గిన్నెలలో ఎంతో కొంత ఆహారం మిగిలిపోతుంది. ఆ గిన్నెలు రాత్రంతా నీటిలో నానుతాయి. దీంతో.. బ్యాక్టీరియా ఎదగడానికి కావాల్సినంత టైమ్ లభిస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. అలా వృద్ధిచెందిన బ్యాక్టీరియా సింక్​ లో మాత్రమే ఉండదని.. వంటగదిలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుందని చెబుతున్నారు. అంటే.. కిచెన్​లోని చాకులు, వాటర్ గ్లాసులు, ఇతరత్రా సామాగ్రికి వ్యాప్తి చెందుతాయని అంటున్నారు.

ఉదయాన్నే శుభ్రం చేసినా..

పొద్దున నిద్రలేచిన తర్వాత సింక్​లో ఉంచిన పాత్రలన్నీ క్లీన్ చేసుకోవడంతో.. అన్నీ క్లీన్ అయ్యాయని భావిస్తారు. కానీ.. అప్పటికే బ్యాక్టీరియా వంట గదిలోకి విస్తరించి ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయం తెలియకుండా.. కిచెన్​లోని వస్తువులన్నీ మామూలుగా వాడేస్తుంటారని, దీనివల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీర్ణ సమస్యలు మొదలు..

వంట గదిలో వ్యాపించే బ్యాక్టీరియా ద్వారా.. జీర్ణసమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అజీర్తి, గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం వంటి ఇబ్బందులు వేధిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. వీలైనంత వరకూ రాత్రివేళనే పాత్రలన్నీ శుభ్రం చేసి, పడుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు తిన్న గిన్నెలు కడుక్కోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. దీనివల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, వంట గదికూడా శుభ్రంగా ఉంటుందని చెబుతున్నారు.

2019లో "జర్నల్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. రాత్రిపూట సింక్​లో ఉంచిన గిన్నెలలో ఈకోలీ వంటి హానికరమైన బ్యాక్టీరియా స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్(USDA)కు చెందిన ప్రముఖ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ జాన్ సమిత్ పాల్గొన్నారు. నైట్​ టైమ్​ సింక్​లో ఉంచిన గిన్నెలలో ఫామ్ అయ్యే బ్యాక్టీరియా వంటగది ఇతర ఉపరితలాలకు, ఆహారానికి వ్యాపించి అనారోగ్యానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఎంత తోమినా గిన్నెల మీద జిడ్డు పోవడం లేదా? - ఇలా చేస్తే చాలు చిటికెలో మాయం!

సాధ్యం కాకపోతే..

అలసిపోయామనో, టైమ్ లేదనో, ఇంకేదైనా కారణం చేతనో మీకు రాత్రి పూట గిన్నెలు తోముకోవడానికి వీలుకాకపోతే.. కనీసం అందులో ఉన్న ఆహారపదార్థాలను తీసి డస్ట్​బిన్​లో వేయాలని సూచిస్తున్నారు. ఫలితంగా.. కొంతమేర బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్నారు. అలాగే.. మరుసటి రోజు ఆ పాత్రలను సబ్బుతో శుభ్రంగా కడిగి.. కాసేపు వేడినీటిలో ఉంచాలని సూచిస్తున్నారు. ఆ తర్వాతే యూజ్ చేయడం మంచిదని చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎంత శుభ్రం చేసినా పాత్రల్లో పసుపు మరకలు పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో సాల్వ్​!

ABOUT THE AUTHOR

...view details