తెలంగాణ

telangana

ఒలింపిక్స్‌ వేడుకల్లో చిరు ఫ్యామిలీ - పారిస్ వీధుల్లో మెగా హీరోల సందడి - Paris Olympics 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 10:50 AM IST

Chiranjeevi Family At Paris Olympics : అట్టహాసంగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు మెగాస్టార్​ చిరంజీవి తన ఫ్యామిలీతో హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను మీరూ చూసేయండి.

Chiranjeevi Family At Paris Olympics
Chiranjeevi Family At Paris Olympics (ETV Bharat)

Chiranjeevi Family At Paris Olympics :పారిస్ వేదికగా అట్టహాసంగా జరిగిన ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెరిశారు. ఆయన తన భార్య సురేఖ, తనయుడు రామ్​చరణ్​, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి ఈ మెగా ఈవెంట్​లో సందడి చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను చెర్రీ సతీమణి ఉపాసన అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక చిరు కూడా ఒలింపిక్​ జ్యోతిని పట్టుకుని ఫొటో దిగారు. దాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్​లో షేర్ చేశారు.

మరోవైపు చిరు ఇటీవలే 'విశ్వంభర' షూటింగ్​కు బ్రేక్ ఇచ్చి తన కుటుంబంతో కలిసి పారిస్​కు వెళ్లారు. అక్కడ ఆయన తన ముద్దుల మనవరాలితో కలిసి వెకేషన్ టైమ్​ను గడుపుతున్నారు. ఈ ట్రిప్​కు సంబంధించిన స్పెషల్ ఫొటోలు అలాగే వీడియోలను చరణ్‌ అలాగే ఉపాసన తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా వారందరూ కలిసి పారిస్‌ వీధుల్లో సరదాగా తిరిగిన ఓ వీడియోను ఉపాసన షేర్‌ చేశారు. అలా చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

PARIS OLYMPICS 2024 OPENING CEREMONY: పారిస్ వేదికగా ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెన్ నదిపై జరిగిన 6 కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై 6,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. సుమారు 3 లక్షలకు పైగా ప్రేక్షకులు ఈవెంట్​ను వీక్షించేందుకు హాజరవ్వగా, వారికోసం నది పరిసరాల్లో 80 భారీ తెరలను ఏర్పాటు చేశారు. క్రీడల్లోని దిగ్గజ అథ్లెట్లు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

సంప్రదాయ దుస్తుల్లో - ఈ పరేడ్‌లో భారత్‌ అథ్లెట్లు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ ఈ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి నాయకత్వం వహించారు. ఈ ఇద్దరు భారతదేశ పతాకధారులుగా వ్యవహరించారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ముందు నిలబడ్డారు. వీళ్ల వెనకాలే మన అథ్లెట్ల పడవ ప్రయాణం సాగింది. వీరంతా సంప్రదాయ భారతీయ దుస్తుల్లో మెరిశారు. మహిళలు త్రివర్ణ పతాకంలోని రంగులతో కూడిన చీరను కట్టుకోగా, పురుషులు కుర్తా, పైజామాను ధరించి ఆకట్టుకున్నారు. మొత్తంగా భారత బృందం తరఫున 78 మంది అథ్లెట్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.

'విశ్వంభర' లేటెస్ట్ అప్డేట్​ - ఫుల్​ హ్యాపీ మోడ్​లో మెగా ఫ్యాన్స్‌! - Chiranjeevi Viswambara

రామ్​చరణ్​కు అరుదైన గౌరవం - 'నాటునాటు'కు రెడీ అవ్వండి ఫ్యాన్స్​

ABOUT THE AUTHOR

...view details