తెలంగాణ

telangana

రిలయన్స్​ వయాకామ్‌ 18, స్టార్ ఇండియా విలీనం- NCLT గ్రీన్​ సిగ్నల్​ - Reliance Disney Merger

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 6:21 AM IST

Updated : Aug 31, 2024, 7:00 AM IST

Reliance Disney Merger : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్‌ 18, ది వాల్ట్‌ డిస్నీ కంపెనీకి చెందిన స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వినోద వ్యాపారాల లివీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రెబ్యునల్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో రూ.70,000 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యంగా మారింది.

RELIANCE VIACOM18
RELIANCE VIACOM18 (ETV Bharat)

Reliance Disney Merger :రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్‌ 18, ది వాల్ట్‌ డిస్నీ కంపెనీకి చెందిన స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వినోద వ్యాపారాలు లివీనం కానున్నాయి. ఈ విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రెబ్యునల్‌ (ఎన్​సీఎల్​టీ) శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో రూ.70,000 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యంగా వయాకామ్‌ 18 మారనుంది.

మీడియా ఆస్తుల విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఇటీవల ఆమోదించింది. ఈ విలీనం అనంతరం జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు కానుందని సీసీఐకు సమర్పించిన నోటీసులో పేర్కొంది. ఈ లావాదేవీల వల్ల దేశంలోని పోటీ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం పడబోదని రిలయన్స్‌ వెల్లడించింది. సీసీఐ ఆమోదం పూర్తయిన రెండు రోజులకే ఎన్‌సీఎల్‌టీ సైతం పచ్చజెండా ఊపింది. రిలయన్స్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఈ విషయంపై గురువారం ప్రస్తావించారు. రిలయన్స్‌, వాల్ట్‌ డిస్నీ వీడియా ఆస్తుల విలీనం, దేశంలో వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలికిందని పేర్కొన్నారు. రిలయన్స్‌ కుటుంబంలోకి డిస్నీని స్వాగతిస్తూ, జియో, రిటైల్‌ వ్యాపారం లాగే ఈ మీడియా వ్యాపారం రిలయన్స్‌ గ్రూప్‌లో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వివిధ టీవీ ఛానెళ్లతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ (డిస్నీ+హాట్‌స్టార్‌)ను నిర్వహిస్తోంది. వయాకామ్‌ 18 కూడా బ్రాడ్‌కాస్టింగ్‌ టెలివిజన్‌ ఛానెళ్ల వ్యాపారాలతో పాటుగా, ఓటీటీని (జియో సినిమా) కూడా నడుపుతోంది. దీంతోపాటు ప్రొడక్షన్‌, మోషన్‌ పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌లోనూ ఉంది. జాయింట్ వెంచర్‌ను ఏర్పాటుచేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలయన్స్‌, వాల్ట్‌ డిస్నీ ఓ ఒప్పందానికి వచ్చాయి. ఈ డీల్‌ పూర్తయితే వివిధ భాషల్లో వందకు పైగా ఛానెళ్లు, 2 ఓటీటీలు విలీన సంస్థ చేతిలో ఉండనున్నాయి. విలీనం అనంతరం ఈ జాయింట్​ వెంచర్​కు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ సంయుక్త సంస్థలో 63.13 శాతం వాటా రిలయన్స్‌కు, 36.84 శాతం వాటా డిస్నీకి వెళ్లనున్నాయి. విలీనం అనంతరం ఓటీటీ వ్యాపారాభివృద్ధికి రూ.11,500 కోట్లు రిలయన్స్‌ పెట్టుబడిగా పెట్టనున్నట్లు రిలయన్స్‌ ఇప్పటికే ప్రకటించింది.

దీపావళి నుంచి జియో ఏఐ క్లౌడ్​, జియో బ్రెయిన్ - ఏఐ ఫోన్ కాల్స్ కూడా! - Jio AI Cloud Storage

రిలయన్స్‌, డిస్నీ డీల్‌ ఖరారు- 120 ఛానళ్లు ఒకే గొడుకు కిందకు

Last Updated : Aug 31, 2024, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details