తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 5:35 PM IST

ETV Bharat / bharat

బాలీవుడ్ నిర్మాతకు యూపీ ఫిల్మ్ సిటీ టెండర్- వెయ్యి ఎకరాల్లో నిర్మాణం!

UP Film City Tender : ఉత్తర్​ప్రదేశ్​ ఫిల్మ్ సిటీ నిర్మాణ ప్రాజెక్టును బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్​కు చెందిన కంపెనీ దక్కించుకుంది. పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ఈ ఫిల్మ్ సిటీ నిర్మాణం కానుంది. వెయ్యి ఎకరాల్లో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయనున్నారు.

UP Film City Tender
UP Film City Tender

UP Film City Tender :ఉత్తర్​ప్రదేశ్​లో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి నిర్వహించిన టెండర్​ను ప్రముఖ సినీనిర్మాత బోనీ కపూర్​కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంది. ఈ గ్రీన్​ఫీల్డ్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దాఖలైన బిడ్లను ( UP Film City Bid ) మంగళవారం తెరిచిన యమునా ఎక్స్​ప్రెస్​వే ఇండస్ట్రీయల్ డెవలప్​మెంట్ అథారిటీ (వైఈఐడీఏ), బోనీ కపూర్ కంపెనీ అధిక మొత్తం కోట్ చేసినట్లు తెలిపింది. నోయిడాలో కొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ ఎయిర్​పోర్ట్​కు సమీపంలో, యమునా ఎక్స్​ప్రెస్​వే వెంబడి ఈ ఫిల్మ్​ సిటీ ఏర్పాటు కానుంది.

'బేవ్యూ ప్రాజెక్ట్స్​ ఎల్ఎల్​పీ' బోనీ కపూర్​తో పాటు భుటానీ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తోంది. అధిక బిడ్ వేసి ప్రాజెక్ట్ గెలుచుకున్నప్పటికీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆమోదం తెలపాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత భూమిని ఆ సంస్థకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పబ్లిక్- ప్రైవేట్ పార్ట్​నర్​షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ ఫిల్మ్​ సిటీని నిర్మించనున్నారు. వెయ్యి ఎకరాల్లో ఫిల్మ్​ సిటీ రూపుదిద్దుకోనుంది. తొలి దశలో భాగంగా 230 ఎకరాల్లో ( UP Film City Area In Acres ) చిత్ర నగరిని అభివృద్ధి చేయనున్నారు.

దిగ్గజ సంస్థల పోటీ
ఫిల్మ్​ సిటీ అభివృద్ధి ప్రాజెక్టు దక్కించుకునేందుకు బేవ్యూ ప్రాజెక్ట్స్​తో పాటు అనేక దిగ్గజ సంస్థలు, బాలీవుడ్ ప్రముఖులకు చెందిన కంపెనీలు పోటీ పడ్డాయి. టీ-సిరీస్​గా సుపరిచితమైన సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, అక్షయ్ కుమార్​ భాగస్వామిగా ఉన్న సూపర్​సోనిక్ టెక్నోబిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిల్మ్​మేకర్ కేసీ బొకాడియాకు చెందిన 4 లయన్స్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.

యోగి కలల ప్రాజెక్టు!
ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఫిల్మ్ సిటీ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీన్ని తన కలల ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని గతంలో యోగి తెలిపారు. రాష్ట్రంలో కొత్త సినిమా పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు. యూపీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్, ఇన్ఫోటెయిన్​మెంట్ కేంద్రం నిర్మించడం వల్ల సినీ నిర్మాణంలో ఉన్న వారు తమ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కొత్త మార్గం దొరుకుతుందని పేర్కొన్నారు.

ఇండియా కూటమికి మరో షాక్​- చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపు

సీఎం కార్లు సీజ్ చేసిన ఈడీ- సోదాల్లో రూ.36లక్షలు స్వాధీనం- భార్యకు పగ్గాలు!

ABOUT THE AUTHOR

...view details