తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రిలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రేకు అస్వస్థత- యాంజియోప్లాస్టీ నిర్వహించే అవకాశం

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

Uddhav Thackeray
Uddhav Thackeray (ETV Bharat)

Uddhav Thackeray Health Issue : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయనను ముంబయిలోని రిలయన్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఉద్ధవ్​కు గుండె సంబంధిత సమస్య తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంతకుముందు 2012లో ఉద్ధవ్‌ ఠాక్రే యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు.

ఉద్ధవ్​ ఠాక్రే ఆరోగ్యం విషయంపై ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సోషల్ మీడియాలో స్పందించారు. ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగానే ఉద్ధవ్ ఠాక్రే సోమవారం ఉదయం రిలయన్స్ ఆస్పత్రికి సాధారణ చెకప్​ కోసం వెళ్లారని తెలిపారు. అందరి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో పోస్ట్ పెట్టారు. సోమవారం సాయంత్రం ఉద్ధవ్ ఠాక్రే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details