Delhi Assembly Elections Polling :దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు తమ ఓట్లను ఈవీఎమ్ల్లో నిక్షిప్తం చేశారు. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. ఫిబ్రవరి 8
ఓట్ల లెక్కింపు రోజున అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ నేపథ్యంలో దిల్లీ పీఠాన్ని అధిరోహించేది ఎవరో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాష్ట్రపతిసహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, విశ్రాంత సీజేఐ డీవై చంద్రచూడ్, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, కేంద్రమంత్రులు జైశంకర్, హర్ దీప్సింగ్పూరీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడితో కలిసి వెళ్లి ఓటువేశారు. మాజీ సీఎం కేజ్రీవాల్, దిల్లీ సీఎం అతిశీ, ఆప్ ఎంపీ సంజయ్సింగ్, మాజీమంత్రి సత్యేంద్రజైన్ తన సతీమణితో కలిసి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు.