Chiranjeevi gave Donation Check to CM Chandrababu:సీఎం చంద్రబాబుని హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి తన తరపున 50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. ఈ క్రమంలో విరాళం చెక్కులు అందించేందుకు సీఎం నివాసానికి వచ్చిన చిరంజీవికి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భేటీ అనంతరం కారు వరకూ వెళ్లి చిరంజీవికి వీడ్కోలు పలికారు.
సీఎం చంద్రబాబును కలసిన నటుడు చిరంజీవి- వరద సాయం చెక్కు అందజేత
సీఎం చంద్రబాబును కలిసిన నటుడు చిరంజీవి - వరద సాయం చెక్కును చంద్రబాబుకు అందజేత
Published : 5 hours ago
|Updated : 4 hours ago
chiranjeevi_gave_donation_to_cm (ETV Bharat)
Last Updated : 4 hours ago