కుమురం భీం జిల్లా కాగజ్నగర్లో రేణుక ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పోచమ్మ ఆలయం నుంచి కల్లు డిపో వరకు శివసత్తులు, పోతురాజుల నృత్యాలతో శోభాయాత్ర నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో మూడేళ్లకు ఒకసారి బోనాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.