పింఛన్ డబ్బుల కోసం దారుణం.. తల్లిపై విచక్షణారహితంగా దాడి.. - kakinada district latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16484885-979-16484885-1664262285225.jpg)
SON ATTACK ON MOTHER In Kakinada: ఏ పేగు తెంచుకుని పుట్టాడో అదే పేగుపై తంతూ.. మెడపై కాలు వేసి తొక్కుతూ తన తల్లితో అంత్యంత కిరాతంగా ప్రవర్తించాడు ఓ కొడుకు. ఈ దారుణ ఘటన ఏపీ కాకినాడ జిల్లా కాజులూరులో జరిగింది. పింఛన్ డబ్పులు ఇవ్వాలని తల్లిబోయిన వెంకన్న మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలైన కన్నతల్లిని కిందపడేసి కాళ్లతో పలుమార్లు తన్నాడు. ఆమెతో మానవమృగంలా ప్రవర్తిస్తూ చిత్ర హింసలకు గురిచేశాడు. ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ తల్లిని స్థానికులు యానాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పందించారు. వెంకన్నపై కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. వృద్ధులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హెచ్చరించారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST