కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ - ఫామ్స్ లేక ప్రజలకు అగచాట్లు

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 5:43 PM IST

thumbnail

Six Guarantees Form Distribution 2nd Day in Hyderabad : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజ పాలనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రజా పాలను కింద అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ నగరంలో జోరుగా కొనసాగుతోంది. 150 డివిజన్లలో ఏర్పాటు చేసిన 600 కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో నగరవాసులు తమ దరఖాస్తులను అందజేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అభయాస్తం దరఖాస్తుల లేమితో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అధకారులు దరఖాస్తులు లేకపోవడంతో వాటిని తెప్పించి ప్రజలకు అందజేస్తున్నారు. 

ఇదే అదునుగా భావిస్తున్న జిరాక్స్ సెంటర్ల యజమానులు అభయాస్తం దరఖాస్తుల నకళ్లను విక్రయిస్తూ దండుకుంటున్నారు. కాగా జిరాక్స్ తీసుకుని వాటిని అప్లే చేస్తే వారి దరఖాస్తులు లెక్కలోకి రాదని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో వాటిని జిరాక్స్ తీసి చిన్నపాటి వ్యాపారాన్నే నడుపుతున్నారు.  మరిన్ని వివరాలను బోరబండ వార్డు కార్యాలయం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.