BRS leader Srihari Rao joined Congress : 'నిర్మల్' ​పై కాంగ్రెస్ ఫోకస్​.. పార్టీలోకి మరో బీఆర్​ఎస్​ నాయకుడు

By

Published : Jun 14, 2023, 5:38 PM IST

thumbnail

Nirmal BRS Leaders joined Congress : కేసీఆర్​ మోసాన్ని భరించే ఓపిక రాష్ట్ర ప్రజలకు లేదని.. సమాజం తిరగబడే సమయం వచ్చిందని టీపీసీసీ ‌అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో నిర్మల్‌కు చెందిన బీఆర్​ఎస్​ నాయకుడు శ్రీహరిరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్​ రెడ్డి.. పార్టీలోకి వచ్చిన వారి అందరికి సముచిత గౌరవం, స్థానం దక్కుతుందని వివరించారు. రాబోయే ఎన్నికల్లో కొడంగల్‌లతో పాటు నిర్మల్‌ నియోజకవర్గాన్ని ప్రాధాన్యంలోకి తీసుకుంటామని వెళ్లడించారు. ఏ గ్రామాల్లో డబుల్‌ బ్రెడ్‌ రూం ఇల్లు కట్టించారో ఆ గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు అడగాలని.. ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రాంతాల్లో కాంగ్రెస్​ ఓట్లు అడుగుతుందన్నారు. నిర్మల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇందుకు సిద్దమా అంటూ సవాల్​ విసిరారు. నిర్మల్‌ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని రేవంత్‌ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు 8 స్థానాలు గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.