'తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 100 స్థానాల్లో విజయదుందుభి మోగిస్తాం' - ఎంపీ కోమటిరెడ్డితో ముఖాముఖి
🎬 Watch Now: Feature Video


Published : Nov 9, 2023, 7:10 PM IST
MP Komati Reddy Venkat Reddy Latest Comments : శాసనసభ ఎన్నికల్లో 100 స్థానాల్లో విజయదుందుభి మోగిస్తామని కాంగ్రెస్ సీనియర్నేత, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి తనతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
రాష్ట్రంల కాంగ్రెస్ పార్టీ సునామీలా దూసుకుపోతుందన్నారు. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు పోవాలన్నదే వారి లక్ష్యమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.లక్షా 70వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఈ నెల 25, 26న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనే నల్గొండ రోడ్ షోని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగుల గురించి మొదటి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ముఖాముఖి.