మిల్లెట్స్​తో 6750కిలోల కిచిడీ తయారీ- విద్యార్థులకు పంపిణీ- అయోధ్యలో 8వేల కిలోల హల్వా! - విష్ణు మనోహర్ చెఫ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 10:03 PM IST

Millet Khichdi Recipe Maharashtra : తృణధాన్యాలతో 6750 కిలోల కిచిడీని తయారుచేశాడు మహారాష్ట్రకు చెందిన విష్ణు మనోహర్ అనే చెఫ్. మిల్లెట్​ల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఇంత భారీ మొత్తంలో చంద్రాపుర్​లో కిచిడీ తయారుచేశానని చెప్పాడు. ప్రధాని నరేంద్ర మోదీ 2023వ సంవత్సరాన్ని మిల్లెట్ ఇయర్​గా ప్రకటించిన నేపథ్యంలో తాను ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పాడు విష్ణు.

ప్రధాని మోదీ పిలుపు మేరకు మహారాష్ట్రలోని 12 ముఖ్యమైన నగరాల్లో భారీ మొత్తంలో తృణధాన్యాలతో కిచిడీని తయారుచేయాలని నిర్ణయించుకున్నానని చెఫ్ విష్ణు మనోహర్​ తెలిపాడు. ఇప్పటికే నాగ్​పుర్​, నాసిక్​, ఔరంగాబాద్​లో భారీ మొత్తంలో కిచిడీ తయారుచేశానని చెప్పాడు. నాగ్​పుర్​లో 6500 కిలోల కిచిడీని తయారుచేసిన విష్ణు తాజాగా చంద్రాపుర్​లో 6750 కిలోల కిచిడీ వండి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. అయితే చంద్రాపుర్​లోని పాఠశాలల్లోని విద్యార్థులకు, స్థానిక రైతులకు ఈ కిచిడీని పంచాడు విష్ణు మనోహర్​. మరోవైపు, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా 8వేల కిలోల హల్వాను తయారుచేస్తానని విష్ణు చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.