అధికారంలోకి వచ్చాక జవహర్నగర్ డంప్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తా : వజ్రేష్ యాదవ్ - కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video


Published : Nov 23, 2023, 1:24 PM IST
Medchal Congress Candidate Vajresh Yadav Interview : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వారం రోజులే సమయం మిగిలి ఉండడంతో.. కాంగ్రెస్ ప్రచారాన్నిహోరెత్తిస్తోంది. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై పదునైన విమర్శలు చేస్తూ.. ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు తిష్టవేశాయని వజ్రేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యంగా జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్య కోసం అనేక ధర్నాలు చేసినా.. అధికార పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో అభివృద్ధి ఏం చేయలేదని వజ్రేష్ అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 8ం సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని.. వచ్చిన వెంటనే ఆరు హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జవహర్నగర్ డంప్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానంటున్న మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్రేష్ యాదవ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.