బస్సులో మంటలు చెలరేగి నిద్రలోనే డ్రైవర్ కండక్టర్ సజీవదహనం - దీపం అంటుకుని కాలిపోయిన బస్సు
🎬 Watch Now: Feature Video

ఝార్ఖండ్ రాంచీలోని ఖాడ్గఢ్ బస్టాండ్లో ఘోరం జరిగింది. దేవునికి పెట్టిన దీపం అంటుకుని బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులో నిద్రిస్తున్న డ్రైవర్ మదన్, కండక్టర్ ఇబ్రహీం సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో పూర్తిగా కాలిపోయిన రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన మంగళవారం వేకువజామున ఒంటిగంటకు జరిగిందని అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST