Blood Donation Camp at Engineering College : ఆ వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేసిన 300మంది విద్యార్థులు.. ఎక్కడంటే.?

By

Published : Jul 5, 2023, 8:44 PM IST

thumbnail

Blood Donation Camp in Rangareddy: యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదు. యువత ముందుకు నడిస్తే సమాజంలో చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. తాజాగా తలసేమియా, క్యాన్సర్​ రోగులకు బ్లడ్​ కోసం ఓ ఇంజినీరింగ్​ విద్యార్థులు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని బడంగ్​ పెట్​ మున్సిపాలిటీ పరిధి ఎంవీఎస్​ఆర్​ ఇంజినీరింగ్​ కాలేజ్​లో ఐ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మెగా బ్లడ్​ క్యాంప్​ నిర్వహించారు. ఇందులో 300 పైగా విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. వారి నుంచి సేకరించిన బ్లడ్​ యునిట్స్​ని నారాయణ్​పేట్​లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పంపించారు. 

ఈ క్యాంప్​లో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనడం ఆనందంగా ఉందని ఐ ఫౌండేషన్ అధ్యక్షులు సుతారపు రవీందర్ అన్నారు. రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. గత కొంత కాలంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు తమ పౌండేషన్​ ద్వారా చేశామని తెలిపారు. ఇక్కడ సేకరించిన రక్తాన్ని తలసేమియా, క్యాన్సర్​తో బాధుపడుతున్న రోగుల కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు. బ్లడ్​ బ్యాంక్​ కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.