thumbnail

అతివేగంతో స్కూటీని ఢీ కొట్టిన బైకర్​

By

Published : Nov 20, 2020, 11:10 AM IST

Updated : Nov 20, 2020, 2:14 PM IST

తమిళనాడు ధర్మపురి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై ఇద్దరు అమ్మాయిలు సేలం-హొసుర్​ బైపాస్​ రోడ్డులో వెళుతూ కలెక్టర్​ కార్యాలయం సమీపంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వేగంగా దూసుకొచ్చి వారి బండిని బలంగా ఢీకొట్టాడు. దాంతో సుమారు 10 మీటర్ల మేర వారు ఎగిరిపడ్డారు. సమీపంలో ఉన్నవారు, ఇతర ద్విచక్రవాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బాలికల పరిస్థితి విషమంగా ఉండటం వల్ల అక్కడి నుంచి సేలం ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Nov 20, 2020, 2:14 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.