thumbnail

నేటి నుంచి బద్రినాథుడి దర్శనం

By

Published : May 10, 2019, 8:26 AM IST

ఉత్తరాఖండ్​ రాష్ట్రంలో కొలువైన నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్​ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు బద్రినాథుడిని దర్శించుకుంటున్నారు. ఆలయాన్ని విద్యుత్​ దీపాలు, పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేల మంది యాత్రికుల సమక్షంలో ఆలయ తలుపులు తెరిచారు వేద పండితులు. ఛార్​దామ్​ యాత్రలో భాగంగా చివరిగా ఈ ఆలయాన్ని సందర్శించి యాత్రను ముగిస్తారు భక్తులు. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి, కేదార్​నాథ్​ ఆలయాలు తెరుచుకున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.