ETV Bharat / sukhibhava

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: బుజ్జి బొజ్జాయిలు ఎక్కువవుతున్నారు!

author img

By

Published : Jun 9, 2020, 9:54 AM IST

Updated : Jun 9, 2020, 11:05 AM IST

కరోనా ఒక్కతీరుగా కాదు.. వేర్వేరు దారుల్లో సమాజాన్ని పీడిస్తోంది. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన చిన్నారులు ఆరోగ్యం, జీవనశైలిలో మార్పులపై పరిశోధనలు చేశారు ఇంగ్లాండ్​కు చెందిన శాస్త్రవేత్తలు. వేళకాని వేళలో తినడం, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం, టీవీ తెరలకు అతుక్కుపొవడం వంటి అనేక కారణాల వల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు మెండుగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. దీనికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు.

special-story-on-obesity-increased-in-children-due-to-lockdown effect
లాక్​డౌన్​ ఎఫెక్ట్​: బుజ్జి బొజ్జాయిలు ఎక్కువవుతున్నారు!

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతటి భయాందోళనకు గురిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైరస్ ప్రభావం ప్రత్యక్ష్యంగానే కాదు పరోక్షంగా కూడా చాలా విషయాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాలకు పెద్ద ముప్పే తెచ్చింది. వివిధ రూపాల్లో దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. చేతిలో ఎక్కువ సమయం ఉండడం వల్ల రోజువారీ కార్యక్రమాలు చాలా మార్పులకు గురయ్యాయి. దీనితో పిల్లలు, యుక్తవయసు వారిలో ఊబకాయ సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి పరిశోధనా ఫలితాలు.

41 మంది పిల్లలపై పరిశోధన

కరోనా పరిణామాలు ఏవిధంగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని విషయాన్ని కనుక్కునేందుకు ఇంగ్లాడ్​లోని యూనివర్సిటీ ఆఫ్ బఫెలో పరిశోధనా బృందం ప్రయత్నించింది. పిల్లల జీవన శైలిలో వచ్చిన మార్పులు, ఆహారం, నిద్ర, శారీరక శ్రమ వంటి ముఖ్యమైన విషయాలు ప్రామాణికంగా తీసుకుని.. పరిశోధన నిర్వహించారు. ఇందుకోసం... శరీర బరువు ఎక్కువగా ఉన్న 41 మంది పిల్లలను ఎంపిక చేసుకున్నారు. వీరంతా... దీర్ఘకాలిక పరిశోధనల్లో భాగంగా పరిశీలనలో ఉన్నావారే. లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న రోజుల్లో రీజు వారీ కార్యక్రమాలు ఏ విధంగా మార్పులు జరిగాయని... దాని పరిణామాలేంటనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇక్కడే పిల్లల్లో రాబోయే కొద్ది కాలంలోనే తీవ్రమైన ఊబకాయ సమస్యలు వేధించబోతున్నట్లు వెల్లడైంది.

సాధారణ కంటే ఎక్కువే తింటున్నారు

అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో బడులు మూతపడ్డాయి. దీంతో పిల్లలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు 2, 3 నెలల నుంచి వారికి ప్రత్యేకంగా వేరే వ్యాపకం అంటూ లేకుండా పోయింది. ఆంక్షల వల్ల కనీసం బయటకు వచ్చేందుకూ అవకాశం లేదు. దీంతో పూర్తిగా నాలుగు గోడల మధ్యలోనే గడుపుతున్నారు. ఈ సమయంలో... సాధారణ రోజుల్లో కంటే.. ఒక పూట భోజనం అధికంగా తీసుకుంటున్నారు. దీనికి అదనంగా చిరుతిళ్లు. నిద్ర సమయాల్లో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం బాగా అలవాటుగా మారింది. దీంతో సగటున అరగంట సమయం ఎక్కువగా నిద్రపోతున్నారు. ఎక్కువగా ఫోన్, టీవీ చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు శీతల పానియాలు, కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నట్లు పరిశోధనలో గుర్తించారు.

జీవనశైలిలో మార్పులు

ఈ కరోనా సమయంలోనే... చిన్న, యుక్తవయసు పిల్లల జీవనశైలిలో గణనీయమైన మార్పులు స్పష్టంగా నిర్ధరించారు పరిశోధకులు. ఎక్కువ కాలం ఇంట్లో ఉండడం వల్ల బరువు నియంత్రణలో అధ్వాన జీవనశైలి అవలంభిస్తున్నట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న కేసుల వల్ల అంతర్జాతీయంగా దేశాలన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన బరువు, ఆహార శైలిలో మార్పులు వెనువెంట యథాస్థితికి తీసుకురావడం చాలా కష్టం. వీటి దుష్పరిణామాలు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు సృష్టించనున్నాయి.

ఈ పరిణామాలన్నింటికి పరిష్కారంగా... ఇంట్లో పెద్దలకు అవగాహన కల్పించాలి. పిల్లలపై అతి గారాబం వల్ల అధిక బరువులు పెరిగి భవిష్యత్తు కాలంలో గుండె జబ్బులు, కిడ్ని, కాలేయ సమస్యలకు గురికాకుండా... జాగ్రత్తలు పడాలని సూచిస్తున్నారు నిపుణులు. వార్తా మాధ్యమాలు, పత్రికలు ద్వారా పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు ఇలాంటి విషయాలపై దృష్టి సారించాలి. పిల్లలకు ఉత్తమ జీవన శైలి అలవాటు చేసేందుకు ప్రయత్నించాలి. అధిక బరువుతో బాధపడేవారికి రోజువారీ వ్యాయామాలు, నడక, పరిమిత ఆహారం, పౌష్టిక, సమతుల ఆహారం తీసుకునేలా ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: యాదాద్రిలో దర్శనాలు ప్రారంభం.. ఆధార్ ఉంటేనే దర్శనం..

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతటి భయాందోళనకు గురిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైరస్ ప్రభావం ప్రత్యక్ష్యంగానే కాదు పరోక్షంగా కూడా చాలా విషయాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాలకు పెద్ద ముప్పే తెచ్చింది. వివిధ రూపాల్లో దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. చేతిలో ఎక్కువ సమయం ఉండడం వల్ల రోజువారీ కార్యక్రమాలు చాలా మార్పులకు గురయ్యాయి. దీనితో పిల్లలు, యుక్తవయసు వారిలో ఊబకాయ సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి పరిశోధనా ఫలితాలు.

41 మంది పిల్లలపై పరిశోధన

కరోనా పరిణామాలు ఏవిధంగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని విషయాన్ని కనుక్కునేందుకు ఇంగ్లాడ్​లోని యూనివర్సిటీ ఆఫ్ బఫెలో పరిశోధనా బృందం ప్రయత్నించింది. పిల్లల జీవన శైలిలో వచ్చిన మార్పులు, ఆహారం, నిద్ర, శారీరక శ్రమ వంటి ముఖ్యమైన విషయాలు ప్రామాణికంగా తీసుకుని.. పరిశోధన నిర్వహించారు. ఇందుకోసం... శరీర బరువు ఎక్కువగా ఉన్న 41 మంది పిల్లలను ఎంపిక చేసుకున్నారు. వీరంతా... దీర్ఘకాలిక పరిశోధనల్లో భాగంగా పరిశీలనలో ఉన్నావారే. లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న రోజుల్లో రీజు వారీ కార్యక్రమాలు ఏ విధంగా మార్పులు జరిగాయని... దాని పరిణామాలేంటనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇక్కడే పిల్లల్లో రాబోయే కొద్ది కాలంలోనే తీవ్రమైన ఊబకాయ సమస్యలు వేధించబోతున్నట్లు వెల్లడైంది.

సాధారణ కంటే ఎక్కువే తింటున్నారు

అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో బడులు మూతపడ్డాయి. దీంతో పిల్లలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు 2, 3 నెలల నుంచి వారికి ప్రత్యేకంగా వేరే వ్యాపకం అంటూ లేకుండా పోయింది. ఆంక్షల వల్ల కనీసం బయటకు వచ్చేందుకూ అవకాశం లేదు. దీంతో పూర్తిగా నాలుగు గోడల మధ్యలోనే గడుపుతున్నారు. ఈ సమయంలో... సాధారణ రోజుల్లో కంటే.. ఒక పూట భోజనం అధికంగా తీసుకుంటున్నారు. దీనికి అదనంగా చిరుతిళ్లు. నిద్ర సమయాల్లో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం బాగా అలవాటుగా మారింది. దీంతో సగటున అరగంట సమయం ఎక్కువగా నిద్రపోతున్నారు. ఎక్కువగా ఫోన్, టీవీ చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు శీతల పానియాలు, కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నట్లు పరిశోధనలో గుర్తించారు.

జీవనశైలిలో మార్పులు

ఈ కరోనా సమయంలోనే... చిన్న, యుక్తవయసు పిల్లల జీవనశైలిలో గణనీయమైన మార్పులు స్పష్టంగా నిర్ధరించారు పరిశోధకులు. ఎక్కువ కాలం ఇంట్లో ఉండడం వల్ల బరువు నియంత్రణలో అధ్వాన జీవనశైలి అవలంభిస్తున్నట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న కేసుల వల్ల అంతర్జాతీయంగా దేశాలన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన బరువు, ఆహార శైలిలో మార్పులు వెనువెంట యథాస్థితికి తీసుకురావడం చాలా కష్టం. వీటి దుష్పరిణామాలు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు సృష్టించనున్నాయి.

ఈ పరిణామాలన్నింటికి పరిష్కారంగా... ఇంట్లో పెద్దలకు అవగాహన కల్పించాలి. పిల్లలపై అతి గారాబం వల్ల అధిక బరువులు పెరిగి భవిష్యత్తు కాలంలో గుండె జబ్బులు, కిడ్ని, కాలేయ సమస్యలకు గురికాకుండా... జాగ్రత్తలు పడాలని సూచిస్తున్నారు నిపుణులు. వార్తా మాధ్యమాలు, పత్రికలు ద్వారా పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు ఇలాంటి విషయాలపై దృష్టి సారించాలి. పిల్లలకు ఉత్తమ జీవన శైలి అలవాటు చేసేందుకు ప్రయత్నించాలి. అధిక బరువుతో బాధపడేవారికి రోజువారీ వ్యాయామాలు, నడక, పరిమిత ఆహారం, పౌష్టిక, సమతుల ఆహారం తీసుకునేలా ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: యాదాద్రిలో దర్శనాలు ప్రారంభం.. ఆధార్ ఉంటేనే దర్శనం..

Last Updated : Jun 9, 2020, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.