ETV Bharat / sukhibhava

రాత్రిళ్లు లేట్​గా డిన్నర్​ చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 2:01 PM IST

Health Problems Due to Late Night Dinner: మీకు రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా..? అయితే బీ అలర్ట్​. ఈ అలవాటు వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. దీనిని మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Health Problems Due to Late Night Dinner
Health Problems Due to Late Night Dinner

Health Problems Due to Late Night Dinner: బిజీ లైఫ్‌స్టైల్‌, లేట్‌ నైట్‌ జాబ్స్‌, పార్టీలు, ఫంక్షన్లు.. ఇలా పలు కారణాలు చూపుతూ.. చాలా మంది రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేస్తూ ఉంటారు. మరికొంత మంది రాత్రి పూట ఆలస్యంగా తినడాన్ని ఓ అలవాటుగా చేసుకుంటారు. కానీ.. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

రాత్రి సమయంలో లేట్​గా భోజనం చేయడం వల్ల.. మలబద్ధకం, గ్యాస్, రక్తంలో చక్కెర పెరగడం, గుండె జబ్బులు వంటి అనేక అరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే.. ఆరోగ్యం పూర్తిగా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.

పడుకునే ముందు చేసే ఈ పొరపాట్లే - అధిక బరువు కారణం!

జీర్ణక్రియ సమస్యలు: రాత్రిపూట మన ఆహారపు అలవాట్లు.. జీర్ణక్రియపై చాలా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. రాత్రి వేళ లేట్​గా భోజనం చేసే వాళ్లు.. ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. డైరెక్ట్‌గా వెళ్లి పడుకుంటారు. భోజనం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకపోవడం వల్ల.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్‌ వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

బరువు పెరుగుతారు: రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తే.. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల.. శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. జీవక్రియ నెమ్మదిగా ఉంటే.. కేలరీలు సరిగ్గా బర్న్ కావు. దీంతో.. శరీరంలో ఫ్యాట్‌ పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి.. భోజనానికి, నిద్రపోవడానికి మధ్య రెండు గంటల గ్యాప్‌ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

సైనస్​ ఇబ్బంది పెడుతోందా? ఈ ఆసనాలతో ఫుల్ రిలీఫ్​!

స్ట్రోక్ పెరిగే ఛాన్స్ : నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల స్ట్రోక్స్​ వచ్చే ప్రమాదం ఏకంగా 28 శాతం పెరుగుతుందట. ఈ అలవాటు సెరెబ్రోవాస్కులర్ డిజార్డర్స్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఉదయం 8 గంటల తర్వాత తినే బ్రేక్​ఫాస్ట్​తో పోలిస్తే.. 9 గంటలకు తీసుకునే అల్పాహారం 6శాతం ప్రమాదాలను పెంచుతుందని చెబుతున్నారు. కాబట్టి రాత్రి 8 గంటలలోపు భోజనం తినడం పూర్తి చేయాలని.. ఉదయం 8 గంటలలోపు టిఫిన్​ తినాలని సూచించారు.

ఇకపోతే ఈ విషయాన్ని పలు అధ్యయనాలు కూడా ధ్రువీకరించాయి. ఇటీవల Barcelona Institute for Global Health, Sorbonne Paris Nord University పరిశోధనా సంస్థలు సంయుక్తంగా లక్ష మంది మీద పరిశోధనలు చేశాయి. ఈ పరిశోధన.. రాత్రి పూట ఆలస్యంగా భోజనం తీసుకోవడం, అలాగే ఉదయం ఆలస్యంగా అల్పాహారం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని స్పష్టం చేసింది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్​తో​ ఇబ్బందా? ఈ ఆయుర్వేద రెమిడీతో ఈజీగా రిలీఫ్​!

జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ లోపాలు మీలో ఉన్నట్లే!

తులసి కషాయం తాగితే జలుబు, దగ్గులతోపాటు 'ఒత్తిడి' మటుమాయం!

Health Problems Due to Late Night Dinner: బిజీ లైఫ్‌స్టైల్‌, లేట్‌ నైట్‌ జాబ్స్‌, పార్టీలు, ఫంక్షన్లు.. ఇలా పలు కారణాలు చూపుతూ.. చాలా మంది రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేస్తూ ఉంటారు. మరికొంత మంది రాత్రి పూట ఆలస్యంగా తినడాన్ని ఓ అలవాటుగా చేసుకుంటారు. కానీ.. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

రాత్రి సమయంలో లేట్​గా భోజనం చేయడం వల్ల.. మలబద్ధకం, గ్యాస్, రక్తంలో చక్కెర పెరగడం, గుండె జబ్బులు వంటి అనేక అరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే.. ఆరోగ్యం పూర్తిగా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.

పడుకునే ముందు చేసే ఈ పొరపాట్లే - అధిక బరువు కారణం!

జీర్ణక్రియ సమస్యలు: రాత్రిపూట మన ఆహారపు అలవాట్లు.. జీర్ణక్రియపై చాలా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. రాత్రి వేళ లేట్​గా భోజనం చేసే వాళ్లు.. ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. డైరెక్ట్‌గా వెళ్లి పడుకుంటారు. భోజనం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకపోవడం వల్ల.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్‌ వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

బరువు పెరుగుతారు: రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తే.. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల.. శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. జీవక్రియ నెమ్మదిగా ఉంటే.. కేలరీలు సరిగ్గా బర్న్ కావు. దీంతో.. శరీరంలో ఫ్యాట్‌ పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి.. భోజనానికి, నిద్రపోవడానికి మధ్య రెండు గంటల గ్యాప్‌ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

సైనస్​ ఇబ్బంది పెడుతోందా? ఈ ఆసనాలతో ఫుల్ రిలీఫ్​!

స్ట్రోక్ పెరిగే ఛాన్స్ : నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల స్ట్రోక్స్​ వచ్చే ప్రమాదం ఏకంగా 28 శాతం పెరుగుతుందట. ఈ అలవాటు సెరెబ్రోవాస్కులర్ డిజార్డర్స్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఉదయం 8 గంటల తర్వాత తినే బ్రేక్​ఫాస్ట్​తో పోలిస్తే.. 9 గంటలకు తీసుకునే అల్పాహారం 6శాతం ప్రమాదాలను పెంచుతుందని చెబుతున్నారు. కాబట్టి రాత్రి 8 గంటలలోపు భోజనం తినడం పూర్తి చేయాలని.. ఉదయం 8 గంటలలోపు టిఫిన్​ తినాలని సూచించారు.

ఇకపోతే ఈ విషయాన్ని పలు అధ్యయనాలు కూడా ధ్రువీకరించాయి. ఇటీవల Barcelona Institute for Global Health, Sorbonne Paris Nord University పరిశోధనా సంస్థలు సంయుక్తంగా లక్ష మంది మీద పరిశోధనలు చేశాయి. ఈ పరిశోధన.. రాత్రి పూట ఆలస్యంగా భోజనం తీసుకోవడం, అలాగే ఉదయం ఆలస్యంగా అల్పాహారం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని స్పష్టం చేసింది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్​తో​ ఇబ్బందా? ఈ ఆయుర్వేద రెమిడీతో ఈజీగా రిలీఫ్​!

జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ లోపాలు మీలో ఉన్నట్లే!

తులసి కషాయం తాగితే జలుబు, దగ్గులతోపాటు 'ఒత్తిడి' మటుమాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.