సాధారణంగా చర్మం దిగువన మెలనోసైట్స్ ఉంటాయి. ఈ కణాల ఆధారంగా మనుషుల చర్మం రంగు ఉంటుంది. మెలనోసైట్స్ ఎక్కువగా ఉన్నవారు నలుపు రంగులో.. తక్కువగా ఉన్నవారు గోధుమ రంగులో ఉంటారు. అయితే కొందరు నలుపు రంగులో ఉన్నవారు.. తెల్లగా అయ్యేందుకు నానా ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడలేని క్రీములు ముఖానికి రాస్తుంటారు. అయితే నలుపు రంగు ఉండటమే మేలంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకో మీరే చదవండి.
భారతీయుల విషయానికి వస్తే.. మెలనోసైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే.. ఇవి మన శరీరానికి మేలే చేస్తాయి. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షణ కల్పిస్తాయి. చర్మ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. అయితే నలుపును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. చర్మంలో కింద ఉండే రంగు వరకు మారచ్చని.. అందుకు చిన్నచిన్న చిట్కాలు అనుసరించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
ఇలా చేయాలి!
వీలైనంతవరకు సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి. అలాగే సన్ లోషన్స్ రాసుకోవాలి. బయట ఎండలోకి వెళ్లినప్పుడు గొడుగు వేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొండ, సముద్రతీర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి.
దీంతో పాటు ఇంట్లో లభించే టమోటా, నిమ్మరసం, పెరుగు వంటి వాటితో ఫేస్ప్యాక్స్ పెట్టుకోవచ్చు. వీటిల్లో ఉండే యాసిడ్స్ చర్మానికి రక్షణనిస్తాయి. అలాగే స్టెరాయిడ్స్ ఉన్న లోషన్స్ కూడా వాడవచ్చు. అయితే కొన్నాళ్లు తర్వాత దుష్ప్రభావం చూపే అవకాశముంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని వాడటం మేలు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. పగలు సెక్స్ చేస్తే పిల్లలు పుట్టరా?