ETV Bharat / state

'అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్​ స్కూల్స్ - ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.25 కోట్లు' - Tg Integrated Residential Schools

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ఈ నెల 11న శంకుస్థాపన - 7 నెలల్లో స్కూళ్ల నిర్మాణాలు పూర్తి : భట్టి

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Telangana Integrated Residential Schools
Telangana Integrated Residential Schools (ETV Bharat)

Telangana Integrated Residential Schools : రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్​ స్కూళ్లకు సొంత భవనాలు లేవని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అందుకు శాసనసభ నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్​ కట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రెసిడెన్షియల్​ స్కూల్స్​ ఉంటాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్​ స్కూల్స్​ నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్​లోని సచివాలయంలో యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్ల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్​, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, 'ఇప్పటికే 20 నుంచి 22 స్కూళ్ల కోసం స్థలం సేకరించాము. దసరాలోపు రెసిడెన్షియల్​ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తాం. గురుకులాలు, రెసిడెన్షియల్​ పాఠశాలలకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నాం. రెసిడెన్షియల్​ స్కూళ్లలో వసతులు సరిగా లేవు. రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్​ స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం 650 రెసిడెన్షియల్​ స్కూళ్లకు సొంత భవనాలు లేవు.' అని వివరించారు.

అందుకే ఇంటిగ్రేటెడ్​ స్కూళ్ల నిర్మాణానికి ఈ ఏడాది రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేవలం విద్యకే కాకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్లకు ఈ నెల 11న శంకుస్థాన చేస్తామని ప్రకటించారు. ఏడు నెలల్లో స్కూళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. ఇందులో ఒక్కో స్కూలు నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరం ఒకటే అనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

గత పదేళ్లు విద్యా వ్యవస్థ పూర్తి నిర్లక్ష్యం : 'ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం. అకడమిక్​ ఇయర్​ ప్రారంభంలోపే భవనాలు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. బదిలీలు పూర్తి చేసి స్కూళ్లలో టీచర్లు అందుబాటులో ఉంచాం. గత పదేళ్ల విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది. గురుకులాల్లో 98 శాతం పాస్​ పర్సెంటేజ్​ ఉంది.' అని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.

విద్యార్థులకు దసరా కానుక : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్లు విద్యార్థులకు దసరా కానుక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్ల ఏర్పాటు అందరికీ శుభవార్త అని హర్షం వ్యక్తం చేశారు. మంచి చేస్తుంటే ప్రతిపక్షాలకు కనిపించట్లేదని మండిపడ్డారు.

'వచ్చే విద్యా సంవత్సరానికి యంగ్​ ఇండియా స్పోర్ట్స్​ యూనివర్సిటీ' - CM REVANTH ON SPORTS UNIVERSITY

స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా : సీఎం రేవంత్ - Young India Skill University

Telangana Integrated Residential Schools : రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్​ స్కూళ్లకు సొంత భవనాలు లేవని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అందుకు శాసనసభ నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్​ కట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రెసిడెన్షియల్​ స్కూల్స్​ ఉంటాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్​ స్కూల్స్​ నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్​లోని సచివాలయంలో యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్ల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్​, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, 'ఇప్పటికే 20 నుంచి 22 స్కూళ్ల కోసం స్థలం సేకరించాము. దసరాలోపు రెసిడెన్షియల్​ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తాం. గురుకులాలు, రెసిడెన్షియల్​ పాఠశాలలకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నాం. రెసిడెన్షియల్​ స్కూళ్లలో వసతులు సరిగా లేవు. రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్​ స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం 650 రెసిడెన్షియల్​ స్కూళ్లకు సొంత భవనాలు లేవు.' అని వివరించారు.

అందుకే ఇంటిగ్రేటెడ్​ స్కూళ్ల నిర్మాణానికి ఈ ఏడాది రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేవలం విద్యకే కాకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్లకు ఈ నెల 11న శంకుస్థాన చేస్తామని ప్రకటించారు. ఏడు నెలల్లో స్కూళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. ఇందులో ఒక్కో స్కూలు నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరం ఒకటే అనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

గత పదేళ్లు విద్యా వ్యవస్థ పూర్తి నిర్లక్ష్యం : 'ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం. అకడమిక్​ ఇయర్​ ప్రారంభంలోపే భవనాలు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. బదిలీలు పూర్తి చేసి స్కూళ్లలో టీచర్లు అందుబాటులో ఉంచాం. గత పదేళ్ల విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది. గురుకులాల్లో 98 శాతం పాస్​ పర్సెంటేజ్​ ఉంది.' అని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.

విద్యార్థులకు దసరా కానుక : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్లు విద్యార్థులకు దసరా కానుక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్ల ఏర్పాటు అందరికీ శుభవార్త అని హర్షం వ్యక్తం చేశారు. మంచి చేస్తుంటే ప్రతిపక్షాలకు కనిపించట్లేదని మండిపడ్డారు.

'వచ్చే విద్యా సంవత్సరానికి యంగ్​ ఇండియా స్పోర్ట్స్​ యూనివర్సిటీ' - CM REVANTH ON SPORTS UNIVERSITY

స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా : సీఎం రేవంత్ - Young India Skill University

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.