ETV Bharat / state

Yadadri Temple: 'ఫిబ్రవరి 15 నాటికి యాదాద్రి  ఆలయ పనులన్నీ పూర్తి చేస్తాం'

యాదాద్రి ఆలయ ప్రధాన పనులన్నీ పూర్తవగా.. తుది మెరుగులతో పాటు ఇతర పనులు వడివడిగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 15 లోపు పనులన్నీ పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నామని యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు కిషన్​రావు తెలిపారు.

author img

By

Published : Dec 24, 2021, 3:10 PM IST

Yadadri Temple
యాదాద్రి ఆలయం

పునర్నిర్మిత యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వయంభువుల దర్శనభాగ్యం భక్తులకు మరో మూడు నెలల్లో కలగనుంది. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతో ఆలయ పున:దర్శనం ప్రారంభం కానుంది. ఆలయ ప్రధాన పనులన్నీ పూర్తవగా తుదిమెరుగులతో పాటు ఇతర పనులు వడివడిగా సాగుతున్నాయి.

విమానగోపురానికి తాపడం పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 15 లోపు పనులన్నీ పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పునర్‌నిర్మాణ పనులు... మహా కుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు కిషన్‌రావుతో ప్రత్యేక ముఖాముఖి...

పునర్నిర్మిత యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వయంభువుల దర్శనభాగ్యం భక్తులకు మరో మూడు నెలల్లో కలగనుంది. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతో ఆలయ పున:దర్శనం ప్రారంభం కానుంది. ఆలయ ప్రధాన పనులన్నీ పూర్తవగా తుదిమెరుగులతో పాటు ఇతర పనులు వడివడిగా సాగుతున్నాయి.

విమానగోపురానికి తాపడం పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 15 లోపు పనులన్నీ పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పునర్‌నిర్మాణ పనులు... మహా కుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు కిషన్‌రావుతో ప్రత్యేక ముఖాముఖి...

యాదాద్రి ఆలయం

ఇదీ చూడండి: Yadadri temple: జనవరి 13న యాదాద్రిలో ఉత్తర ద్వారదర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.