యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో నిర్మితమవుతున్న ప్రధానాలయం వద్ద గల అష్టభుజి మండప ప్రాకారాలపై ఏర్పాటైన సాలహారాలలో దేవతామూర్తుల విగ్రహాలను పొందుపరిచే సన్నాహాలకు యాడా సిద్ధమైంది. కర్నూల్ జిల్లా కోవెలకుంట్లలో సిద్ధమైన విగ్రహాలను తీసుకొచ్చి సాలహారాలలో బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీయర్ స్వామి సలహాలు, సూచనలతో వైష్ణవత్వం ఉట్టిపడేలా విష్ణుమూర్తి అవతారాలకు చెందిన విగ్రహాలను పొందుపర్చి దివ్యక్షేత్రంగా మార్చే ప్రణాళికతో తీర్చిదిద్దుతున్నారు.
ఇవీ చూడండి: యాదాద్రి ఆలయ నగరిలో అపార్ట్మెంట్లు